ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"ఈనామ్".. మాకొద్దు... అన్నదాతల ఆందోళన - ap latest

రైతుకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో.. మార్కెట్​యార్డుల్లో అమలు చేస్తున్న ఈనామ్​ విధానానికి వ్యతిరేకత ఎదురవుతోంది. తెనాలి మార్కెట్​ యార్డులో నిమ్మకాయల రైతులు ఈనామ్​ పద్ధతి వద్దంటూ ఆందోళన చేశారు.

మాకొద్దు..ఈనామ్​ పద్ధతి: నిమ్మకాయల రైతులు

By

Published : Jul 2, 2019, 4:52 PM IST

నిమ్మకాయల రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్​లో ఉద్రిక్తత నెలకొంది. ఈనామ్​(ఆన్​లైన్​ టెండర్​) పద్ధతి అమలు చేయోద్దంటూ.. నిమ్మకాయల రైతులు ఆందోళన చేశారు. రైతుకు మద్దతు ధర, అమ్మకంలో పారదర్శకత కల్పించాలనే ఉద్దేశంతో.. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈనామ్​పై కర్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నిమ్మకాయల రైతులు.. తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం జరగకుండా గిట్టుబాటు ధర అందించాలని కోరుతున్నారు.


'ఈనెల 4 నుంచి కచ్చితంగా అమలు చేస్తాం'
ఓ పక్క అన్నదాతలు ఆందోళనలు చేస్తుంటే... అధికారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆన్​లైన్​ టెండర్​ విధానం ద్వారా తెనాలి వ్యవసాయ మార్కెట్​లో ఈనెల 4నుంచి... నిమ్మకాయల క్రయవిక్రయాలను కచ్చితంగా జరుపుతామని తెలుపుతున్నారు.

ఇవీ చదవండి...'భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details