ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న విధానపరమైన నిర్ణయ వివరాలు వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయంలో మంత్రివర్గ చర్చలు, వాటి రికార్డులు, పత్రాలు సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతం చేయడానికి వీలు పడదని స్పష్టం చేసింది.
'ఈడబ్ల్యూఎస్' వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన కేబినెట్ నోట్, పీఎంవోతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు కోరుతూ ఎన్జీవో వెంకటేశ్ నాయక్ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆర్టీఐ చట్టం సెక్షన్ 8 (1)(ఐ) ప్రకారం ఈ వివరాలు వెల్లడించడానికి వీలు పడదని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.