పట్టాలెక్కిన 'వందేభారత్ ఎక్స్ప్రెస్' - ట్రైన్18'
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్ రహిత 'వందే భారత్ ఎక్స్ప్రెస్'ను ఇవాళ మోదీ ప్రారంభించారు.

పట్టాలెక్కిన 'వందేభారత్ ఎక్స్ప్రెస్'
పట్టాలెక్కిన 'వందేభారత్ ఎక్స్ప్రెస్'
మేకిన్ ఇండియాలో భాగంగా భారత తొలి ఇంజిన్ రహిత రైలు 'వందే భారత్ ఎక్స్ప్రెస్'ను చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రైలును తొలుత ‘'ట్రైన్18'’గా పిలిచారు. ఇటీవలే కేంద్రం '‘వందే భారత్ ఎక్స్ప్రెస్'’గా దీనికి నామకరణం చేశారు. 16 బోగీలు ఉన్న ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా దీనికి పేరుంది. దిల్లీ-వారణాసి మధ్య ఇది రాకపోకలు సాగించనుంది.