ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఓట్ల లెక్కింపులో నిబంధనలు కచ్చితంగా పాటించాలి'

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని..ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వీరపాండియన్, సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు. అనంతపురం జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కౌంటింగ్​ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు.

By

Published : May 10, 2019, 6:32 AM IST

Updated : May 10, 2019, 11:58 AM IST

సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు

సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు

కౌంటింగ్​లో పాటించవలసిన నిబంధనలు, ఏవైనా సమస్యలు తలెత్తితే ఎలా వ్యవహరించాలన్న విషయాలపై అధికారులు చర్చించారు. ఓట్ల లెక్కింపు అనంతపురం పార్లమెంట్​ స్థానానికి జె.ఎన్.టి.యులో, హిందూపురం స్థానానికి ఎస్కే యూనివర్శిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాల్​లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్ వైజర్తో పాటు పరిశీలకులు ఉంటారని తెలిపారు. కౌంటింగ్​కు ఈ నెల 22వ తేదీన ర్యాండమైజేషన్ చేసి సిబ్బంది నియామకం చేపడతామన్నారు.

Last Updated : May 10, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details