ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2019, 9:01 PM IST

ETV Bharat / briefs

దేశ రక్షణతో ఆటలా? : రవిశంకర్​ ప్రసాద్​

రఫేల్​ ఒప్పందంలో రాహుల్ బాధ్యతారహితంగా ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు

రవిశంకర్​ ప్రసాద్​

రవిశంకర్​ ప్రసాద్​
రఫేల్​ ఒప్పందంలో మోదీ రాజద్రోహి అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రవిశంకర్​ ప్రసాద్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై పార్లమెంట్ ఆవరణలో స్పందించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి.

రాహుల్​ గాంధీ ప్రధానిపై బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్​ నేతలపై మండిపడ్డారు. గత కాంగ్రెస్​ ప్రభుత్వాలకు, మోదీ ప్రభుత్వానికి మధ్య చాలా వ్యత్యాసముందని రవిశంకర్​ తెలిపారు. కాంగ్రెస్​ హయాంలో ఎన్నో రక్షణ ఒప్పందాలు జరిగినా... కాంగ్రెస్​ నాయకులనెప్పుడూ దేశద్రోహులుగా విమర్శించలేదని గుర్తుచేశారు.

ప్రధానిపై బుదర చల్లాలని ప్రయత్నిస్తున్న రాహుల్​ అదే బురదని తమ మొహంపైనే చల్లుకుంటున్నారని ఆరోపించారు.

రఫేల్​ ఆరోపణలపై రాహుల్​ చూపుతున్న ఈ-మెయిల్​ యుద్ధవిమానాలకు సంబంధించినది కాదు. ​అది వేరే హెలికాఫ్టర్​ కొనుగోలుకు సంబంధించినదని వివరించారు. యూరోపియన్​ ఎయిర్​క్రాఫ్ట్​ సంస్థ ఎయిర్​బస్​ ఈ-మెయిల్​ రాహుల్​ గాంధీకి ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని న్యాయశాఖ మంత్రి డిమాండ్​ చేశారు.

"ఎయిర్​బస్ సంస్థ ఈ-మెయిల్స్​ తనకెలా అందాయో రాహుల్​ గాంధీ సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నాం. మీరు దేశ రక్షణతో ఆటలాడుతున్నారు. విదేశీ కంపెనీలకు రాహుల్​ గాంధీనే మధ్యవర్తిగా వ్యవహరించారు."
- రవిశంకర్ ప్రసాద్​, కేంద్ర న్యాయశాఖ మంత్రి

ప్రధానిపై రాహుల్​ ఆరోపణలు...

ప్రధాని రఫేల్‌ ఒప్పందానికి ముందు ఫ్రాన్స్‌ రక్షణమంత్రిని కలిసి యుద్ధ విమానాల తయారీ డీల్​ అనిల్​ అంబానీకి దక్కేలా సంప్రదింపులు జరిపారని పాత్రికేయుల సమావేశంలో ఆరోపించారు రాహుల్. ఫ్రాన్స్​ ప్రభుత్వానికి, అనిల్​ అంబానీకి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించిన మోదీ దేశద్రోహని రాహుల్​ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details