'ఫొని' ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవల్సిన ముందస్తు జాగ్రత్తలపై..అధికారులను కలెక్టర్ నివాస్ అప్రమత్తం చేశారు. ఈరోజే 42 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏపీ సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఏర్పాట్లను వివరించారు. అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలకు సమాయత్తమవ్వాలన్నారు.
శ్రీకాకుళంలో మారిన వాతావరణం.. అధికారులు అప్రమత్తం - అప్రమత్తమైన అధికారులు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. అధికార యంత్రాంగాన్ని శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ అప్రమత్తం చేశారు. ఈరోజే 42 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
శ్రీకాకుళం వాతావరణంలో మార్పులు