ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2019, 8:20 AM IST

ETV Bharat / briefs

రాజీవ్​కుమార్​పై ముగిసిన సీబీఐ విచారణ

శారదా కుంభకోణం కేసులో కోల్​కతా సీపీ రాజీవ్​కుమార్​పై సీబీఐ విచారణ ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో 20 గంటలపాటు అధికారులు రాజీవ్ కుమార్​ను విచారించారు.

రాజీవ్​కుమార్​పై ముగిసిన సీబీఐ విచారణ

రాజీవ్​కుమార్​పై ముగిసిన సీబీఐ విచారణ
శారదా కుంభకోణం​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​కుమార్​ పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ ఆదివారంతో ముగిసింది. రాజీవ్ కుమార్​​, తృణమూల్​ మాజీ ఎంపీ కృనాల్ ఘోష్​ల​ను ఒకే సారి ప్రశ్నించారు అధికారులు.

మొదటి రోజు తొమ్మిది గంటలు, రెండో రోజు 11 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. శారదా కుంభకోణం కేసులో రాజీవ్​కుమార్​​, సాక్ష్యాధారాలు మాయం చేశారన్న అభియోగాలను మోపింది సీబీఐ. విచారణ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలన్న రాజీవ్​ అభ్యర్థనకు సీబీఐ నిరాకరించింది.

శారదా కుంభకోణం కేసుకు సంబంధించి 2013లో కృనాల్​ను అరెస్టు చేశారు. 2016 నుంచి ఆయన బెయిల్​ మీద ఉన్నారు. ఈ కేసులో 12 మందితో పాటు భాజపా నాయకుడు ముకుల్ రాయ్​ నిందితులుగా ఉన్నారు.

సీబీఐకి కేసు అప్పగించడానికి ముందు శారదా కుంభకోణంపై, రాజీవ్​కుమార్​ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) విచారణ జరిపింది. కంపెనీ దివాలా తీసిన అనంతరం దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ బృందాన్ని నియమించారు.

ABOUT THE AUTHOR

...view details