ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి' - vishka navy

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా..ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని నావికులకు కేంద్ర రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​ పిలుపునిచ్చారు. రెండురోజుల పాటు విశాఖలోని తూర్పు నౌకాదళంలో బసచేసిన ఆయన.. వివిధ అంశాలను పరిశీలించారు.

నావికులతో కేంద్ర రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​

By

Published : Jul 1, 2019, 4:52 AM IST


కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​..రెండు రోజుల విశాఖ పర్యటనలో కీలక కార్యక్రమాలకు హాజరయ్యారు. యుద్ధనౌకలు, జలాంతర్గాములను సందర్శించారు. అనంతరం నౌకదళ అధికారులు, సివిల్​ ఉద్యోగులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశపు యాక్ట్​ ఈస్ట్​ పాలసీ అమలులో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని రాజ్​నాథ్​ అభిప్రాయపడ్డారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా..ఎదుర్కుకునేందుకు సిద్ధంగా ఉండాలని నావికులకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details