జగన్మోహన్రెడ్డితో సీఎస్ సుబ్రమణ్యం భేటీ - AP_VJA_28_23
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిశారు. జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు.ఎన్నికల ఫలితాలు సహా భవిష్యత్ కార్యక్రమాలపై అధికారికంగా జరిగే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.
![జగన్మోహన్రెడ్డితో సీఎస్ సుబ్రమణ్యం భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3356987-thumbnail-3x2-cs.jpg)
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం కావటంతో జగన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టనున్నందున ప్రోటోకాల్ ప్రకారం జగన్ ను కలసి అభినందనలు తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. కొద్దిసేపు జరిగిన భేటీ లో ఎన్నికల ఫలితాలు సహా భవిష్యత్ కార్యక్రమాలపై అధికారికంగా జరిగే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని జగన్ నిర్ణయించినట్లు వైకాపా ప్రకటించింది.ప్రభుత్వ పరంగా కార్యక్రమ నిర్వహణ పైనా ముందస్తు చర్చించినట్లు తెలిసింది. . పలువురు పార్టీ నేతలు సహా ఐఎ ఎస్ లు , ఐపీఎస్ లు, అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని జగన్ నివాసానికి వచ్చి జగన్ ను కలిసి అభినందనలు తెలుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
TAGGED:
AP_VJA_28_23