ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కనీస వేతనం రోజుకు రూ.375!

కార్మికులకు కనీస వేతనం నిర్ణయించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు నిపుణుల కమిటీ కొత్త నిబంధనావళి ప్రతిపాదించింది.

By

Published : Feb 15, 2019, 4:07 PM IST

కనీస వేతనం రోజుకు రూ.375!

కార్మికుల కనీస వేతనం రోజుకు రూ.375 లేదా నెలకు రూ.9,750గా ఉండాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు డాక్టర్​ స్నూప్​ సత్పతి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. రంగం, నైపుణ్యం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అతీతంగా ఈ వేతనం ఇవ్వాలని సూచించింది.

పట్టణాల్లో పని చేసే కార్మికులకు అదనంగా రోజుకు రూ.55 లేదా నెలకు రూ.1,430 ఇంటి అద్దె భత్యం ఇవ్వాలని ప్రతిపాదించింది సత్పతి కమిటీ.

ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను అనుసరించి వేతన నిర్ణయం కోసం రాష్ట్రాలను 5 భాగాలుగా విభజించింది సత్పతి కమిటీ. ఆయా ప్రాంతాల కార్మికులకు కనీస వేతనం రోజుకు కనిష్ఠంగా రూ.342, గరిష్ఠంగా రూ.447గా నిర్ణయించారు.

మదింపు ఇలా...

కనీస వేతనంపై సిఫార్సులు చేసేందుకు జాతీయ నమూనా సర్వే (ఎన్​ఎస్​ఎస్​ఓ) గణాంకాలను పరిగణనలోకి తీసుకుంది సత్పతి కమిటీ. చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మార్పులకు తగినట్లుగా కనీస వేతనాన్ని ప్రతి 6నెలలకు ఒకసారి సవరించాలని సూచించింది.

జాతీయ కనీస వేతనాలను నిర్ణయించేందుకు 2017 జనవరి 17న డాక్టర్​ స్నూప్ సత్పతి, వి.వి. గిరి నేతృత్వంలో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ కమిటీని నియమించింది.

ABOUT THE AUTHOR

...view details