ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / breaking-news

చేజారిన సిరీస్​..

By

Published : Feb 8, 2019, 10:53 AM IST

2-0 ఆధిక్యంలో కివీస్​

2019-02-08 10:39:24

2-0 ఆధిక్యంలో కివీస్​

న్యూజిలాండ్​తో జరుగుతోన్న మహిళల టీ-20 సిరీస్​ను కోల్పోయింది భారత్​. ఇప్పటికే తొలి మ్యాచ్​ ఓడిన భారత్​ ఈ రోజు జరిగిన రెండో టీ-20లోనూ పరాజయం పాలైంది. ఫలితంగా, 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్​ దక్కించుకుంది కివీస్​. నామమాత్రమైన మూడో టీ-20 ఫిబ్రవరి 10న జరగనుంది. 

హోరాహోరీగా సాగిన పోరులో చివరివరకు ఉత్కంఠ రేకెత్తించింది. కివీస్​ చివరి బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్​ 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. రోడ్రిగ్స్​ 72 పరుగులు చేసింది. కివీస్​ సరిగ్గా 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సుజీ బేట్స్​ 62 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్​, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. 

ABOUT THE AUTHOR

...view details