ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

కవిత్వంతో అలరించిన అథవాలే - piyus goyal

బడ్జెట్​ ప్రసంగ సమయంలో కేంద్రమంత్రి రామ్​దాస్​ అథవాలే కవిత్వంతో లోక్​సభ సభ్యులను అలరించారు.

ramdas athawale

By

Published : Feb 1, 2019, 8:01 PM IST

తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్​ గోయల్​ బడ్జెట్​ ప్రసంగ సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పీయూష్​ గోయల్​పై కవిత్వం చెప్పి అందరినీ అలరించారు కేంద్రమంత్రి రామదాస్​ ఆథవాలే.

అథవాలే తన ద్విపదలు, కవిత్వాలతో సహజంగా అందరినీ అలరిస్తుంటారు. పీయూష్​ గోయల్ బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తున్న సమయంలో అథవాలే అకస్మాత్తుగా లేచి కవిత్వం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దీనిపై స్పందించిన భాజపా ఎంపీలు, ఆర్థికమంత్రి ప్రసంగానికి అడ్డుతగలవద్దని అథవాలేకు సూచించారు.

మరో మూడు సందర్భాల్లోనూ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ దృష్టిని ఆకర్షించారు రామ్​దాస్​ అథవాలే. పీయూష్​గోయల్​ మధ్యతరగతి ప్రజలు, రైతుల గురించి ప్రస్తావిస్తున్న సమయంలో రామదాస్​ కవిత్వం చెప్పి రాహుల్ దృష్టిని మరల్చారు.

ABOUT THE AUTHOR

...view details