ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 6, 2019, 6:46 AM IST

Updated : Feb 6, 2019, 9:51 AM IST

ETV Bharat / bharat

''అవినీతి అధికారులకు మమత వత్తాసు''

సీబీఐ అధికారులను అడ్డుకున్న మమతా బెనర్జీ ..దీక్ష చేయటంపై భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో పర్యటించిన ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి శారదా కుంభకోణం విషయంలో దీదీపై ఆరోపణలు చేశారు.

"మమత అవినీతి అధికారులను కాపాడుతోంది"

అవినీతి అధికారులకు మమత వత్తాసు
శారదా కుంభకోణంలోని అవినీతి అధికారులను కాపాడటం పైనే మమతా బెనర్జీ దృష్టిసారిస్తున్నారని.. రాష్ట్రంలోని పేద ప్రజలను దోచుకుంటున్నారని ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆరోపించారు.

బంగాల్​లో ఒక కవాతులో మాట్లాడిన ఆయన... కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్ ​కుమార్​ను కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు.

పోలీసు అధికారులను మమతా బెనర్జీ ఎందుకు కాపాడాలనుకుంటుందో తెలపాలని డిమాండ్​ చేశారు. ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చోవటం రాజ్యాంగ వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా చేస్తున్నారని యోగి విమర్శించారు.

Last Updated : Feb 6, 2019, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details