ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

మాల్యా ''అప్పగింత''... స్వాగతించిన భారత్​ - అప్పీలు

మాల్యాను భారత్​కు అప్పగించాలన్న బ్రిటన్​ ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్​ మాల్యా

By

Published : Feb 5, 2019, 8:06 AM IST

Updated : Feb 5, 2019, 8:57 AM IST

విజయ్​ మాల్యాను అప్పగించాలని బ్రిటన్ తీసుకున్న​ నిర్ణయాన్ని భారత్​ స్వాగతించింది. చట్టపరమైన చర్యల పూర్తి కోసమే వేచిచూస్తున్నామని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఈ పరిణామంపై అరుణ్​జైట్లీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. మాల్యాను రప్పించేందుకు మోదీ ప్రభుత్వం ముందడుగు వేసిందని.. అదే సమయంలో ప్రతిపక్షాలు శారదా కుంభకోణం. నిందితుల చుట్టూ తిరుగుతున్నాయని విమర్శించారు.

అప్పీలుకు 14 రోజుల గడువు...

బ్రిటన్​ ప్రభుత్వ నిర్ణయంపై ఫిబ్రవరి 4 నుంచి 18 వరకు అక్కడి హైకోర్టులో మాల్యా అప్పీలు చేసుకోవచ్చు.

బ్యాంకు రుణాల ఎగవేతతో పాటు విజయ్​ మాల్యా మనీ లాండరింగ్ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. మాల్యా అప్పగింత ఆదేశాలపై పాకిస్థాన్​ మూలాలున్న బ్రిటన్​ హోం మంత్రి సాజిద్​ జావిద్​ ఆదివారం సంతకం చేశారు. దీనిని సోమవారం ఆ శాఖ అధికారులు ధ్రువీకరించారు.

Last Updated : Feb 5, 2019, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details