ETV Bharat / state

సుఖ ప్రసవం చేస్తామని... తలను మాత్రమే తీశారు

9నెలలు మోసి... ఇంకొద్ది సేపట్లో తన బిడ్డ బయటకు వస్తోందని ఆనందపడ్డ ఆ తల్లికి గర్భశోకమే మిగిల్చారు ఆ నిర్లక్షపు వైద్యులు. ప్రసవం చేస్తూ... తలను మాత్రమే బయటకు తీసి మొండాన్ని కడుపులోనే వదిలేసి.. ప్రాణం పోయాల్సిన వైద్యులే పసిపాపను కడుపులోనే చిదిమేశారు.

author img

By

Published : Dec 20, 2019, 6:02 PM IST

Updated : Dec 20, 2019, 9:09 PM IST

Achchampeta Government Hospital doctors Neglect Negligence in Nagar Kurnool District
సుఖ ప్రసవం చేస్తామని... తలను మాత్రమే తీశారు

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం చేస్తూ... శిశువు తలభాగం బయటకు తీసి మొండాన్ని కడుపులోనే వదిలేశారు వైద్యులు.

నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి 3 రోజుల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. సుఖప్రసవం జరుగుతుందని వైద్యులు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మూడో రోజు వైద్యులు డెలివరీ చేస్తున్న సమయంలో తల భాగం తెగిపోయి మొండం కడుపులోనే ఉండిపోయింది. ఈ క్రమంలో మహిళ పరిస్థితి విషమంగా మారటం వల్ల వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హుటాహుటిన హైదరాబాద్​కు తరలించగా... ఆపరేషన్​ చేసి తలలేని మొండాన్ని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు చికిత్స అందిస్తున్నారు. ఇదంతా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మహిళ కుటుంబం ఆస్పత్రిలో ఆందోళనకు దిగింది. వైద్యులపై దాడికి దిగగా.... అడ్డుకున్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇవీ చూడండి: పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం చేస్తూ... శిశువు తలభాగం బయటకు తీసి మొండాన్ని కడుపులోనే వదిలేశారు వైద్యులు.

నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి 3 రోజుల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. సుఖప్రసవం జరుగుతుందని వైద్యులు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మూడో రోజు వైద్యులు డెలివరీ చేస్తున్న సమయంలో తల భాగం తెగిపోయి మొండం కడుపులోనే ఉండిపోయింది. ఈ క్రమంలో మహిళ పరిస్థితి విషమంగా మారటం వల్ల వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హుటాహుటిన హైదరాబాద్​కు తరలించగా... ఆపరేషన్​ చేసి తలలేని మొండాన్ని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు చికిత్స అందిస్తున్నారు. ఇదంతా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మహిళ కుటుంబం ఆస్పత్రిలో ఆందోళనకు దిగింది. వైద్యులపై దాడికి దిగగా.... అడ్డుకున్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇవీ చూడండి: పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు

Intro:TG_MBNR_8_20_GOVT_HPTL_NO_HEAD_CHILD_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ లో ధారుణం చోటు చేసుకుంది.మూడు రోజుల క్రితం అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన సుగురి స్వాతి అనే గర్భిణిని డెలివరీ కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.సుఖ ప్రసవం జరుగుతుందని చికిత్సలు చేసిన వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యలు తెలిపారు.మూడవ రోజు డెలివరీ చేసిన డాక్టర్లు డెలివరీ చేసి తల భాగం తెగిపోయిందని మృత శిషువు మొండెం గర్భంలో మిగిలిపోయిందని తల్లి పరిస్థితి సీరియస్ గా ఉందని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పడంతో హుటాహుటిన హైదరాబాద్ కు రెపర్ చేశారు.ఇక్కడ సిజేరియన్ చేసి మొండెం లేని మృత శిశువుని కుటుంబ సభ్యులకు చూపించడంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు.బంధువులు
అచ్చంపేట ఆసుపత్రికి వచ్చి జరిగిన దారుణం గురించి ఆసుపత్రి వైద్యులను నిలధీయటంలో జరిగిన తోపులాటలో ఆసుపత్రి అద్దాలను పగులగోట్టి వైద్యులపై దాడికి దిగడంతో పోలీసులు వచ్చి ఆందోళన కారులను సముదాయించారు.ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పోలీసులకు స్వల్పంగా గాయాలపాలయ్యారు.నిర్లక్ష్యం గా విధులకు నిర్వహించి పసికందు మృతికి కారకులైన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.కడుపులోని మొండెంతో ప్రాణాపాయ స్థితిలో బాలింత హైదరాబాద్ లో చికిత్స పోందుతుంది.ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు...AVBody:TG_MBNR_8_20_GOVT_HPTL_NO_HEAD_CHILD_AVB_TS10050Conclusion:TG_MBNR_8_20_GOVT_HPTL_NO_HEAD_CHILD_AVB_TS10050
Last Updated : Dec 20, 2019, 9:09 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.