ETV Bharat / state

మద్యం మోతాదుకు మించితే కఠిన చర్యలే..

author img

By

Published : Dec 3, 2019, 5:43 AM IST

మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల పట్ల న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటోంది.  నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం  నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఈ మధ్య ఇద్దరికి 6 నెలల జైలు శిక్ష విధించి చర్లపల్లి జైలుకు పంపించారు.

మద్యం మోతాదుకు మించితే కఠిన చర్యలే..
మద్యం మోతాదుకు మించితే కఠిన చర్యలే..
మద్యం మోతాదుకు మించితే కఠిన చర్యలే..

మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లను ట్రాఫిక్ పోలీసులు వదలిపెట్టడం లేదు. తనిఖీలు ముమ్మరం చేసి... శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా రక్తంలో ఆల్కహాల్ శాతం 38 పాయింట్లుగా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఉంటే... కేసు నమోదు చేస్తున్నారు. పట్టుబడ్డ వారిని కౌన్సిలింగ్​ ఇచ్చిన అనంతరం న్యాయస్థానంలోనూ ప్రవేశపెడుతున్నారు. రక్తంలో ఆల్కహాల్ శాతం, గతంలో వాహనదారులు ఇదే తరహాలో పట్టుబడిన ఘటనలను బట్టి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేయడం, జరిమానా విధించడం, లేకపోతే కొన్ని రోజుల పాటు శిక్షలు విధించడం లాంటి తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నాయి. అయితే రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరికి మాత్రం 6 నెలల జైలు శిక్షపడింది.

ఆల్కహాల్​ శాతం 497 పాయింట్లు:

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇద్దరు వాహనదారులకు నూతన చట్టం కింద 6 నెలల జైలు శిక్ష పడింది. రాజు అనే వ్యక్తి గత నెల 16న తన ద్విచక్ర వాహనంపై దమ్మాయిగూడ రహదారి మీదుగా వెళ్తున్న క్రమంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజుకు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. రక్తంలో ఆల్కహాల్ శాతం 497 పాయింట్లు ఉన్నట్లుగా నిర్ధరణ అయింది. ట్రాఫిక్ పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మంగళవారం మల్కాజిగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రాజుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు రాజును చర్లపల్లి జైలుకు తరలించారు.

తప్పించుకు తిరిగి..

కూకట్ పల్లి న్యాయస్థానం కూడా గత నెల 18న ఈ తరహా శిక్షనే విధించింది. నేపాల్​కు చెందిన బహదూర్ బండేలా మోతాదుకు మించి మద్యం సేవించి రెండుసార్లు ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. గతేడాది ఆగస్టు 3న ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. వాహనాన్ని వదలిపెట్టి కౌన్సిలింగ్​కు హాజరు కాకుండా బహదూర్ తప్పించుకు తిరిగాడు. మరోసారి ఈ ఏడాది మే 4న మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికినా... కౌన్సిలింగ్​కు రాలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతన్ని నవంబర్​ 18న అదుపులోకి తీసుకొని కూకట్ పల్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు. బహదూర్​కు 6 నెలల జైలు శిక్ష, ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిందితుడిని ట్రాఫిక్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇవీ చూడండి : దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు

మద్యం మోతాదుకు మించితే కఠిన చర్యలే..

మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లను ట్రాఫిక్ పోలీసులు వదలిపెట్టడం లేదు. తనిఖీలు ముమ్మరం చేసి... శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా రక్తంలో ఆల్కహాల్ శాతం 38 పాయింట్లుగా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఉంటే... కేసు నమోదు చేస్తున్నారు. పట్టుబడ్డ వారిని కౌన్సిలింగ్​ ఇచ్చిన అనంతరం న్యాయస్థానంలోనూ ప్రవేశపెడుతున్నారు. రక్తంలో ఆల్కహాల్ శాతం, గతంలో వాహనదారులు ఇదే తరహాలో పట్టుబడిన ఘటనలను బట్టి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేయడం, జరిమానా విధించడం, లేకపోతే కొన్ని రోజుల పాటు శిక్షలు విధించడం లాంటి తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నాయి. అయితే రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరికి మాత్రం 6 నెలల జైలు శిక్షపడింది.

ఆల్కహాల్​ శాతం 497 పాయింట్లు:

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇద్దరు వాహనదారులకు నూతన చట్టం కింద 6 నెలల జైలు శిక్ష పడింది. రాజు అనే వ్యక్తి గత నెల 16న తన ద్విచక్ర వాహనంపై దమ్మాయిగూడ రహదారి మీదుగా వెళ్తున్న క్రమంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజుకు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. రక్తంలో ఆల్కహాల్ శాతం 497 పాయింట్లు ఉన్నట్లుగా నిర్ధరణ అయింది. ట్రాఫిక్ పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మంగళవారం మల్కాజిగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రాజుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు రాజును చర్లపల్లి జైలుకు తరలించారు.

తప్పించుకు తిరిగి..

కూకట్ పల్లి న్యాయస్థానం కూడా గత నెల 18న ఈ తరహా శిక్షనే విధించింది. నేపాల్​కు చెందిన బహదూర్ బండేలా మోతాదుకు మించి మద్యం సేవించి రెండుసార్లు ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. గతేడాది ఆగస్టు 3న ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. వాహనాన్ని వదలిపెట్టి కౌన్సిలింగ్​కు హాజరు కాకుండా బహదూర్ తప్పించుకు తిరిగాడు. మరోసారి ఈ ఏడాది మే 4న మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికినా... కౌన్సిలింగ్​కు రాలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతన్ని నవంబర్​ 18న అదుపులోకి తీసుకొని కూకట్ పల్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు. బహదూర్​కు 6 నెలల జైలు శిక్ష, ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిందితుడిని ట్రాఫిక్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇవీ చూడండి : దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు

TG_HYD_03_03_DRUNK_DRIVE_PENALTY_PKG_REWISE_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ TG_HYD_26_02_ఫైల్ వచ్చిన విజువల్స్, TG_HYD_03_03 పేరు మీద డెస్క్ వాట్సాప్ కు వచ్చిన ఫోటో వాడుకోగలరు. ( ) మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల పట్ల న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుంటోంది. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్ల ప్రమాదాలు జరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. శ్వాస విశ్లేషణ పరీక్షల్లో పట్టుబడితే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు.... న్యాయస్థానాల్లో హాజరు పరుస్తున్నారు.....LOOK V.O- మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లను ట్రాఫిక్ పోలీసులు వదలిపెట్టడం లేదు. తనిఖీలు ముమ్మరం చేసి... శ్వాస విశ్లేషన పరీక్షలు నిర్వహిస్తున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలితే వెంటనే వాహనదారుల వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాల గురించి వీడియోలతో సహా వివరిస్తున్నారు. జరిగే ప్రమాదాలు.... కుటుంబాలు వీధి పాలయ్యే సంఘటనలను గురించి పూసగుచ్చినట్లు చెబుతున్నారు. దీనివల్ల వాహనదారుల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా రక్తంలో ఆల్కహాల్ శాతం 38 పాయింట్లుగా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఉంటే... కేసు నమోదు చేస్తున్నారు. పట్టుబడ్డ వారిని కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం న్యాయస్థానంలోనూ ప్రవేశపెడుతున్నారు. రక్తంలో ఆల్కహాల్ శాతం, గతంలో వాహనదారులు ఇదే తరహాలో పట్టుబడిన ఘటనలను బట్టి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేయడం, జరిమానా విధించడం, లేకపోతే కొన్ని రోజుల పాటు శిక్షలు విధించడం లాంటి తీర్పులను న్యాయస్థానాలు ఇస్తున్నాయి. కానీ రెండు వేర్వేరు కేసుల్లో వాహనదారులకు మాత్రం 6 నెలల జైలు శిక్షపడింది. V.O - సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధిలో ఇద్దరు వాహనదారులకు నూతన చట్టం కింద 6 నెలల జైలు శిక్ష పడింది. రాజు అనే వ్యక్తి గత నెల 16వ తేదీన తన ద్విచక్ర వాహనంపై దమ్మాయిగూడ రహదారి మీదుగా వెల్తున్న క్రమంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజుకు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. రక్తంలో ఆల్కహాల్ శాతం 497 పాయింట్లు ఉన్నట్లుగా తేలింది. ట్రాఫిక్ పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మంగళవారం రోజు మల్కాజ్ గిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రాజుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు రాజును చర్లపల్లి జైలుకు తరలించారు. కూకట్ పల్లి న్యాయస్థానం కూడా గత నెల 18న ఈ తరహా శిక్షనే విధించింది. నేపాల్ కు చెందిన బహదూర్ బండేలా మోతాదుకు మించి మద్యం సేవించి రెండుసార్లు ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. గతేడాది ఆగస్టు 3వ తేదీన మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. వాహనాన్ని వదలిపెట్టి కౌన్సిలింగ్ హాజరు కాకుండా బహదూర్ తప్పించుకు తిరిగాడు. మరోసారి ఈ ఏడాది మే 4వ తేదీన మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికినా... కౌన్సిలింగ్ రాలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతని గత నెల 18వ తేదీన అదుపులోకి తీసుకొని కూకట్ పల్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు. బహదూర్ కు 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు... ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిందితుడిని ట్రాఫిక్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. E.V.O- ట్రాఫిక్ పోలీసులు, న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నా... కొంతమంది వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడుతూనే ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.