ETV Bharat / state

'పల్లె ప్రగతి'పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి ఎర్రబెల్లి - Palle pragthi

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల రెండో తేదీన పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కలెక్టర్లను ఆదేశించారు.

'రెండో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి'
'రెండో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి'
author img

By

Published : Dec 27, 2019, 8:55 PM IST

జనవరి రెండు నుంచి నిర్వహించనున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్లను ఆదేశించారు. పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషితో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.

యువకులు, మహిళలు, పెన్షనర్లు పాల్గొనాలి

మొదటి దశ విజయవంతం చేసినట్లే రెండో దఫాను కూడా విజయవంతం చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లోని యువకులు, మహిళలు, పెన్షనర్లు కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని చెప్పారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

'పరిశీలినకు రాష్ట్ర స్థాయి ప్లయింగ్ స్క్వాడ్'

పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు 50 మంది రాష్ట్ర స్ధాయి అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా నియమించినట్లు సీఎస్ జోషి తెలిపారు. ప్రతీ అధికారికి వివిధ జిల్లాల్లోని 12 మండలాలు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడత పల్లె ప్రగతిలో ఒక రోజు శ్రమదానానికి ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ సూచించారు. మొదటి దశ స్ఫూర్తితో రెండోదశలోనూ ప్రజలంతా పాల్గొని విజయవంతంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలిపారు.

'రెండో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి'

ఇవీ చూడండి : రాష్ట్రంలో పల్లెప్రగతి కోసం ఫ్లయింగ్​స్క్వాడ్స్​

జనవరి రెండు నుంచి నిర్వహించనున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్లను ఆదేశించారు. పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషితో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.

యువకులు, మహిళలు, పెన్షనర్లు పాల్గొనాలి

మొదటి దశ విజయవంతం చేసినట్లే రెండో దఫాను కూడా విజయవంతం చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లోని యువకులు, మహిళలు, పెన్షనర్లు కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని చెప్పారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

'పరిశీలినకు రాష్ట్ర స్థాయి ప్లయింగ్ స్క్వాడ్'

పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు 50 మంది రాష్ట్ర స్ధాయి అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా నియమించినట్లు సీఎస్ జోషి తెలిపారు. ప్రతీ అధికారికి వివిధ జిల్లాల్లోని 12 మండలాలు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడత పల్లె ప్రగతిలో ఒక రోజు శ్రమదానానికి ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ సూచించారు. మొదటి దశ స్ఫూర్తితో రెండోదశలోనూ ప్రజలంతా పాల్గొని విజయవంతంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలిపారు.

'రెండో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి'

ఇవీ చూడండి : రాష్ట్రంలో పల్లెప్రగతి కోసం ఫ్లయింగ్​స్క్వాడ్స్​

TG_Hyd_32_27_Pallepragthi_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) వచ్చే నెల రెండోతేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే రెండోవిడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి తో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి... అనంతరం జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, మొదటి దశ విజయవంతం చేసినట్లే రెండోదఫా విజయవంతానికి తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. పల్లెప్రగతి నిర్వహణతో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందన్న ఎర్రబెల్లి... గ్రామాల్లోని యువకులు, మహిళలు, పెన్షనర్లు కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని కోరారు. గ్రామాల వారీగా చేపట్టిన, చేపట్టబోయే పనులు, కార్యక్రమాల వివరాలపై బుక్ లెట్ అందించాలన్న మంత్రి... పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే స్ఫూర్తి కలిగేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు. గ్రామాల్లో నర్సరీల పెంపకం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులకు స్ధలసేకరణ, నాటిన మొక్కల సంరక్షణ, శిథిల గృహాల తొలగింపు, పాతబావుల పూడ్చివేత, డస్ట్ బిన్ల సరఫరా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం లాంటి అంశాలపై దృష్టి సారించాలని దయాకర్ రావు సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు జనవరి రెండో తేదీన నిర్వహించే గ్రామసభల్లో పాల్గొనాలని... గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సరిగా పల్లె ప్రగతిని నిర్వహించేలా చూడాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు మంచిగా పనిచేసే వారిని ప్రోత్సహించాలని సూచించారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎర్రబెల్లి కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు 50 మంది రాష్ట్ర స్ధాయి అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా నియమించినట్లు తెలిపిన సీఎస్ జోషి... ప్రతి అధికారికి వివిధ జిల్లాల్లోని 12 మండలాలు కేటాయించినట్లు తెలిపారు. మండలంలోని రెండు చొప్పున గ్రామ పంచాయతీలను సందర్శించి పనుల పురోగతి, నాణ్యత, కార్యక్రమ అమలును పరిశీలిస్తారని చెప్పారు. మార్చి 31 నాటికి కేటాయించిన మండలాలను సందర్శించి పల్లె ప్రగతి కార్యక్రమాల అమలును, గ్రామాలకు చేకూరిన లబ్ధిని అంచనా వేయాలని సీఎస్ స్పష్టం చేశారు. 23 అంశాల్లో ప్రతి అంశానికి 1 నుంచి 5 వరకు గ్రేడింగ్ ఇవ్వాలని... పంచాయతీ రాజ్ శాఖ రూపొందించిన మోబైల్ యాప్ లో సమాచారాన్ని పొందుపర్చాలని సూచించారు. మొదటి దఫా పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు, ఖర్చు, రెండో విడత నిర్వహణ ప్రణాళిక, బడ్జెట్ తదితర వివరాలను రెండో విడతకు ముందే పంచాయతీ కార్యదర్శులు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించాలని... గత నాలుగు నెలలుగా చేసిన ఖర్చును మండల పంచాయతీ అధికారులు తనిఖీ చేయాలని చెప్పారు. రెండో విడత పల్లె ప్రగతిలో ఒక రోజు శ్రమదానానికి ప్రత్యేకంగా కేటాయించాలని... గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ సూచించారు. మొదటి దశ స్ఫూర్తితో రెండోదశలోనూ ప్రజలంతా పాల్గొని విజయవంతంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.