ETV Bharat / business

రివ్యూ 2019: ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు పరుగో పరుగు

author img

By

Published : Dec 29, 2019, 5:00 PM IST

Updated : Dec 31, 2019, 7:10 AM IST

2019 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది జరిగిన మార్పుల్లో స్టాక్ మార్కెట్ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది మార్కెట్లో సంభవించిన కీలక ఘట్టాలు.. ఆటపోట్లను ఒక్క సారి గుర్తుచేసుకుందాం.

STOOCKS THIS YEAR
స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది

అంతర్జాతీయంగా అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం వంటి ఎన్నో అవరోధాలు ఉన్నా.. దేశీయ స్టాక్​ మార్కెట్లు ఈ ఏడాది సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇటీవల వాణిజ్య యుద్ధానికి తెరపడినా.. ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో సూచీలు ఆందోళనకర సంకేతాలిచ్చినా.. పడి లేచిన కెరటాల్లా మళ్లీ లాభాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోదీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా రాజకీయ పరంగా సుస్థిరత ఏర్పడింది. ఫలితంగా ఆటుపోట్లు ఉన్నా మార్కెట్లు ముందుకే పయనించాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్రం ఉద్దీపనలు ప్రకటించడమూ మార్కెట్లకు కలిసొచ్చింది.

ఈ ఏడాదిలో సూచీలు సాగాయిలా..

36,254.57 పాయింట్లతో ఏడాది తొలి సెషన్​ను ప్రారభించిన సెన్సెక్స్​.. ప్రస్తుతం 40,575.14 పాయింట్ల వద్ద ఉంది (డిసెంబర్ 27 నాటికి). ఈ లెక్కన ఇప్పటి వరకు సెన్సెక్స్ 4,320.57 పాయింట్లు పెరిగింది.

నిఫ్టీ ఈ ఏడాది తొలి సెషన్​ 10,910.10 వద్ద ప్రారంభించింది.. ప్రస్తుతం ఈ సూచీ 12,145.80 వద్ద ఉంది (డిసెంబర్ 27 నాటికి). ఇప్పటి వరకు నిఫ్టీ మొత్తం 1,235.7 పాయింట్లు బలపడింది.

కీలక స్థాయిలు ఇవే..

ఈ ఏడాదిలోనే సెన్సెక్స్ 39,000, 40,000, 41,000 మార్క్​ల​ను దాటింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపాకు స్పష్టమైన మెజారిటీ వస్తున్నట్లు తెలియడం వల్ల తొలిసారి మే 23న సెన్సెక్స్ 40,000 మార్క్​ను తాకింది. నిఫ్టీ 12,000 మార్క్​ను తాకింది. మోదీ 2.0 ప్రభుత్వం రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా కొన్ని రోజులు ఆ సానుకూలతలు కొనసాగాయి.

ఈ ఏడాది మొత్తం మీద ఇంట్రాడేలో.. సెన్సెక్స్ సెప్టెంబర్ 20న 2163 పాయింట్లకు పైగా లాభాన్ని గడించింది. నిఫ్టీ 655 పాయింట్లకు పైగా లాభాన్ని నమోదు చేసింది. కార్పొరేట్​ పన్ను 10 శాతం మేర తగ్గిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం ఇందుకు కారణం. ఇదే రోజు బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల్లో మదుపరుల సంపద రూ.7 లక్షల కోట్లు పెరిగింది.

నష్టాల పరంగా చూస్తే సెన్సెక్స్ బడ్జెట్​ మరుసటి రోజు జులై 8న 793 పాయింట్లు, జీడీపీ రేటు తగ్గుదల ఆందోళనలతో సెప్టెంబర్​ 3న 770 పాయింట్లు క్షీణించింది. సెప్టెంబర్​ 3న నిఫ్టీ 225 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ఈ షేర్లు భళా..

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఎం-క్యాప్​ ఈ ఏడాదే రూ.10 లక్షల కోట్ల మార్క్​ను దాటింది. ఈ కారణంగా దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.

ఈ రేసులో టీసీఎస్​ కాస్త వెనుకంజలో ఉండి.. రూ.8 లక్షల కోట్లకు పైగా ఎం-క్యాప్​తో రెండో స్థానంలో నిలిచింది.

ఇటీవలే ప్రైవేట్ రంగ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రూ.7 లక్షల కోట్ల ఎం-క్యాప్​ను సాధించింది. ఈ మార్క్​ను అందుకున్న మూడో భారత సంస్థగా నిలిచింది. బ్యాంకింగ్ రంగంలో రూ.7 లక్షల కోట్ల మార్కెట్​ క్యాపిటల్​ను అందుకున్న తొలి భారతీయ బ్యాంకు ఇదే కావడం విశేషం.

మొత్తం మీద ఈ ఏడాది బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు భారీగా వృద్ధి చెందాయి.

ఈ షేర్లు డీలా..

జెట్ ఎయిర్​వేస్​ షేర్లు ఈ ఏడాది భారీగా పతనమయ్యాయి. ఈ షేర్లు ఇప్పటి వరకు 90 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం ఈ సంస్థను విక్రయించే పనుల్లో ఉన్నారు రుణదాతలు. జెట్​ ఎయిర్​ సహా పలు మధ్య చిన్న తరహా షేర్లూ ఈ ఏడాది మదుపరులకు అంతగా లాభాలు సృష్టించలేకపోయాయి.

మొత్తం మీద ఎస్​ బ్యాంకు, హెచ్​సీఎల్​టెక్​, ఇండియా బుల్స్​ హౌసింగ్​, జీ ఎంటర్​టైన్​మెంట్​ షేర్లు ఈ ఏడాది భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:కొత్త సంవత్సరంలో తగ్గనున్న కూరగాయల ధరలు!

అంతర్జాతీయంగా అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం వంటి ఎన్నో అవరోధాలు ఉన్నా.. దేశీయ స్టాక్​ మార్కెట్లు ఈ ఏడాది సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇటీవల వాణిజ్య యుద్ధానికి తెరపడినా.. ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో సూచీలు ఆందోళనకర సంకేతాలిచ్చినా.. పడి లేచిన కెరటాల్లా మళ్లీ లాభాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోదీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా రాజకీయ పరంగా సుస్థిరత ఏర్పడింది. ఫలితంగా ఆటుపోట్లు ఉన్నా మార్కెట్లు ముందుకే పయనించాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్రం ఉద్దీపనలు ప్రకటించడమూ మార్కెట్లకు కలిసొచ్చింది.

ఈ ఏడాదిలో సూచీలు సాగాయిలా..

36,254.57 పాయింట్లతో ఏడాది తొలి సెషన్​ను ప్రారభించిన సెన్సెక్స్​.. ప్రస్తుతం 40,575.14 పాయింట్ల వద్ద ఉంది (డిసెంబర్ 27 నాటికి). ఈ లెక్కన ఇప్పటి వరకు సెన్సెక్స్ 4,320.57 పాయింట్లు పెరిగింది.

నిఫ్టీ ఈ ఏడాది తొలి సెషన్​ 10,910.10 వద్ద ప్రారంభించింది.. ప్రస్తుతం ఈ సూచీ 12,145.80 వద్ద ఉంది (డిసెంబర్ 27 నాటికి). ఇప్పటి వరకు నిఫ్టీ మొత్తం 1,235.7 పాయింట్లు బలపడింది.

కీలక స్థాయిలు ఇవే..

ఈ ఏడాదిలోనే సెన్సెక్స్ 39,000, 40,000, 41,000 మార్క్​ల​ను దాటింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపాకు స్పష్టమైన మెజారిటీ వస్తున్నట్లు తెలియడం వల్ల తొలిసారి మే 23న సెన్సెక్స్ 40,000 మార్క్​ను తాకింది. నిఫ్టీ 12,000 మార్క్​ను తాకింది. మోదీ 2.0 ప్రభుత్వం రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా కొన్ని రోజులు ఆ సానుకూలతలు కొనసాగాయి.

ఈ ఏడాది మొత్తం మీద ఇంట్రాడేలో.. సెన్సెక్స్ సెప్టెంబర్ 20న 2163 పాయింట్లకు పైగా లాభాన్ని గడించింది. నిఫ్టీ 655 పాయింట్లకు పైగా లాభాన్ని నమోదు చేసింది. కార్పొరేట్​ పన్ను 10 శాతం మేర తగ్గిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం ఇందుకు కారణం. ఇదే రోజు బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల్లో మదుపరుల సంపద రూ.7 లక్షల కోట్లు పెరిగింది.

నష్టాల పరంగా చూస్తే సెన్సెక్స్ బడ్జెట్​ మరుసటి రోజు జులై 8న 793 పాయింట్లు, జీడీపీ రేటు తగ్గుదల ఆందోళనలతో సెప్టెంబర్​ 3న 770 పాయింట్లు క్షీణించింది. సెప్టెంబర్​ 3న నిఫ్టీ 225 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ఈ షేర్లు భళా..

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఎం-క్యాప్​ ఈ ఏడాదే రూ.10 లక్షల కోట్ల మార్క్​ను దాటింది. ఈ కారణంగా దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.

ఈ రేసులో టీసీఎస్​ కాస్త వెనుకంజలో ఉండి.. రూ.8 లక్షల కోట్లకు పైగా ఎం-క్యాప్​తో రెండో స్థానంలో నిలిచింది.

ఇటీవలే ప్రైవేట్ రంగ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రూ.7 లక్షల కోట్ల ఎం-క్యాప్​ను సాధించింది. ఈ మార్క్​ను అందుకున్న మూడో భారత సంస్థగా నిలిచింది. బ్యాంకింగ్ రంగంలో రూ.7 లక్షల కోట్ల మార్కెట్​ క్యాపిటల్​ను అందుకున్న తొలి భారతీయ బ్యాంకు ఇదే కావడం విశేషం.

మొత్తం మీద ఈ ఏడాది బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు భారీగా వృద్ధి చెందాయి.

ఈ షేర్లు డీలా..

జెట్ ఎయిర్​వేస్​ షేర్లు ఈ ఏడాది భారీగా పతనమయ్యాయి. ఈ షేర్లు ఇప్పటి వరకు 90 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం ఈ సంస్థను విక్రయించే పనుల్లో ఉన్నారు రుణదాతలు. జెట్​ ఎయిర్​ సహా పలు మధ్య చిన్న తరహా షేర్లూ ఈ ఏడాది మదుపరులకు అంతగా లాభాలు సృష్టించలేకపోయాయి.

మొత్తం మీద ఎస్​ బ్యాంకు, హెచ్​సీఎల్​టెక్​, ఇండియా బుల్స్​ హౌసింగ్​, జీ ఎంటర్​టైన్​మెంట్​ షేర్లు ఈ ఏడాది భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:కొత్త సంవత్సరంలో తగ్గనున్న కూరగాయల ధరలు!

AP Video Delivery Log - 0600 GMT News
Sunday, 29 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0552: Australia Firefighters No access Australia 4246647
NSW firefighters back moves to compensate volunteers
AP-APTN-0542: US Synagogue Stabbing AP Clients Only 4246646
5 stabbed at Hanukkah celebration north of NYC
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 31, 2019, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.