విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రాంతంలో గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లటానికి అవస్థలు పడుతున్నారు. సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పొర్లు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ఇటీవల నొప్పులు వచ్చాయి. గ్రామం నుంచి డోలీ కట్టి ఆసుపత్రికి బయల్దేరారు. మార్గమధ్యలోనే ఆమె ప్రసవించింది. 20 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లిన గ్రామస్థులు... 108 వాహనంలో ఎస్.కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు.
ఇవీ చదవండి