ETV Bharat / state

గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగానే ప్రసవం - Pregnancy pains ... delivery while Dolly was taken to the hospital with help in vizianagaram district

సరైనరోడ్డు మార్గం లేదు. ఆసుపత్రికి వెళ్లాలంటే కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలి. ఇది గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి. సాధారణ సమయంలో ఎలా ఉన్నా... గర్భిణిలు ప్రసవ సమయంలో మాత్రం నరకం చూడాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది విజయనగరం జిల్లాలో.

గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగా ప్రసవం
గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగా ప్రసవం
author img

By

Published : Jan 1, 2020, 8:17 PM IST

గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగానే ప్రసవం

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రాంతంలో గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లటానికి అవస్థలు పడుతున్నారు. సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పొర్లు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ఇటీవల నొప్పులు వచ్చాయి. గ్రామం నుంచి డోలీ కట్టి ఆసుపత్రికి బయల్దేరారు. మార్గమధ్యలోనే ఆమె ప్రసవించింది. 20 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లిన గ్రామస్థులు... 108 వాహనంలో ఎస్.కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు.

గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగానే ప్రసవం

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రాంతంలో గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లటానికి అవస్థలు పడుతున్నారు. సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పొర్లు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ఇటీవల నొప్పులు వచ్చాయి. గ్రామం నుంచి డోలీ కట్టి ఆసుపత్రికి బయల్దేరారు. మార్గమధ్యలోనే ఆమె ప్రసవించింది. 20 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లిన గ్రామస్థులు... 108 వాహనంలో ఎస్.కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు.

ఇవీ చదవండి

నిండు గర్భిణీని 6 కిలోమీటర్లు డోలీలో మోస్తూ...

Intro:మారుమూల గిరిజన గ్రామంలో గర్భిణీకి నొప్పులు రావడంతో భర్త మరికొందరు డోలీ కట్టి తీసుకు వస్తుండగా మార్గ మధ్యలో ప్రసవం జరిగి ఆడపిల్ల పుట్టింది. ఈసంఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పొర్లు గ్రామంలో జరిగింది.



Body:బుధవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో కేరంగి చిన్నాలమ్మకు నొప్పులు రావడంతో డోలీలో మోసుకుంటూ ఎస్. కోట తీసుకువస్తుండగా మార్గమధ్యంలో ప్రసవం అయి ఆడపిల్ల పుట్టింది. 20కిలోమీటర్ల దూరం మోసుకుంటూ తీసుకువచి 108వాహనంలో ఎస్. కోట సామాజిక ఆసుపత్రిలో చేర్చారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి ఇన్ఛార్జి డా.. త్రినాథరావు తెలిపారు.

Conclusion:రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగా గిరిజన స్త్రీలు తీవ్రంగా నష్టపోతునారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక ఆసుపత్రిలో ఉంచారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.