విశాఖ జిల్లాలో అరబిక్ రుచులు నోరూరించాయి. అలియెన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థుల చేతి వంటతో సాగర తీరం ఘుమఘుమలాడింది. అనేక వంటకాలు తయారు చేసి... అలంకరించి... ఆహా అనిపించుకున్నారు. కోర్సు పూర్తైన సందర్భంగా నైపుణ్యాన్ని చాటేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా ఒంటెలతో స్వాగతం ఏర్పాటు చేశారు. విద్యార్థులు స్వశక్తితో నిలబడి, నైపుణ్యం నేర్చుకునేందుకు ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయని అధ్యాపకులు చెప్తున్నారు. అరబిక్ రుచులతోపాటు విద్యార్థుల వస్త్రధారణ ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: