ETV Bharat / state

సమరావతి :రాజధాని రైతుపై గర్జించిన లాఠీ

author img

By

Published : Jan 11, 2020, 6:21 AM IST

అమరావతి ప్రాంతంలో 24వ రోజు నిరసనలో లాఠీలే బిగ్గరగా మాట్లాడాయి. బెజవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించేందుకు మహిళలు తలపెట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మూకుమ్మడి ప్రదర్శనలకు అనుమతి లేకున్నా..మహిళలు ముందుకెళ్లటంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించారు. రాత్రి సమయంలో విడుదల చేసినప్పటికీ...సాయంత్రం 6 గంటల తర్వాత మహిళలను స్టేషన్‌లో ఎలా ఉంచుతారంటూ రైతులు విరుచుకుపడ్డారు.

రాజధాని రైతుపై గర్జించిన లాఠీ
రాజధాని రైతుపై గర్జించిన లాఠీ

అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. సకల జనుల సమ్మె, జాతీయ రహదారి దిగ్బంధం అనంతరం దుర్గమ్మకు పొంగళ్ల సమర్పణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, పోలీస్‌ 30 చట్టం అమల్లో ఉన్నందున మూకుమ్మడి ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు ముందు నుంచీ హెచ్చరిస్తున్నా.... వెనక్కి తగ్గేది లేదని రైతులు, మహిళలు ప్రతినబూనారు.

తుళ్లూరు నుంచి ఉద్ధండరాయునిపాలెం మీదుగా విజయవాడ వెళ్లాలనుకున్న ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు వేసిన బ్యారికేడ్లు, ఇనుపకంచెలను రైతులు పక్కకు నెట్టేశారు. దీంతో నిరనసకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులకు లాఠీ పనిచెప్పగా... వారికి, రైతులకు తోపులాట జరిగింది.

ఇనుపకంచెను దాటే క్రమంలో కొందరు మహిళలకు గాయలవగా... ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. కొందరు నిరసనకారుల్ని పోలీసులు దొరికినవారిని దొరికినట్టే వ్యాన్‌లో పడేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే వారందరినీ అడ్డుకున్నామని... శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు స్పష్టం చేశారు.

అరెస్టైన రైతులు,మహిళలను నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ నుంచి బెయిల్‌పై విడుదల చేయించేందుకు తెదేపా, జనసేన నేతలు చేరుకోవటంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై ఎంపీ గల్లా జయదేవ్‌ మండిపడ్డారు. విజయవాడలో ర్యాలీ నిర్వహించిన మహిళలను సుమారు 3 గంటల తర్వాత విడుదల చేశారు. ఏఆర్ గ్రౌండ్స్‌లో వివరాల సేకరణ పేరుతో తమను ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వరకూ మహిళలను విడుదల చేయకపోవటంతో ఎంపీ కేశినేని నాని, సీపీఐ నేత రామకృష్ణ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

రాజధాని రైతుపై గర్జించిన లాఠీ

ఇదీచదవండి

అమరావతిలో ఆగ్రహ జ్వాల

అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. సకల జనుల సమ్మె, జాతీయ రహదారి దిగ్బంధం అనంతరం దుర్గమ్మకు పొంగళ్ల సమర్పణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, పోలీస్‌ 30 చట్టం అమల్లో ఉన్నందున మూకుమ్మడి ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు ముందు నుంచీ హెచ్చరిస్తున్నా.... వెనక్కి తగ్గేది లేదని రైతులు, మహిళలు ప్రతినబూనారు.

తుళ్లూరు నుంచి ఉద్ధండరాయునిపాలెం మీదుగా విజయవాడ వెళ్లాలనుకున్న ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు వేసిన బ్యారికేడ్లు, ఇనుపకంచెలను రైతులు పక్కకు నెట్టేశారు. దీంతో నిరనసకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులకు లాఠీ పనిచెప్పగా... వారికి, రైతులకు తోపులాట జరిగింది.

ఇనుపకంచెను దాటే క్రమంలో కొందరు మహిళలకు గాయలవగా... ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. కొందరు నిరసనకారుల్ని పోలీసులు దొరికినవారిని దొరికినట్టే వ్యాన్‌లో పడేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే వారందరినీ అడ్డుకున్నామని... శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు స్పష్టం చేశారు.

అరెస్టైన రైతులు,మహిళలను నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ నుంచి బెయిల్‌పై విడుదల చేయించేందుకు తెదేపా, జనసేన నేతలు చేరుకోవటంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై ఎంపీ గల్లా జయదేవ్‌ మండిపడ్డారు. విజయవాడలో ర్యాలీ నిర్వహించిన మహిళలను సుమారు 3 గంటల తర్వాత విడుదల చేశారు. ఏఆర్ గ్రౌండ్స్‌లో వివరాల సేకరణ పేరుతో తమను ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వరకూ మహిళలను విడుదల చేయకపోవటంతో ఎంపీ కేశినేని నాని, సీపీఐ నేత రామకృష్ణ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

రాజధాని రైతుపై గర్జించిన లాఠీ

ఇదీచదవండి

అమరావతిలో ఆగ్రహ జ్వాల

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.