ETV Bharat / state

'ప్రతి గ్రామం.. తుళ్లూరు, మందడం కావాలి'

author img

By

Published : Jan 12, 2020, 11:30 PM IST

గుంటూరు జిల్లా నరసారావుపేటలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న ఐక్య కార్యాచరణ సమితి తరఫున జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం బహిరంగ సభకు హాజరయ్యారు. అమరావతి విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టారు.

chandrababu about capital amaravathi at narasaraopeta
chandrababu about capital amaravathi at narasaraopeta

జై అమరావతి అనేది.. అందరి నినాదం కావాలని రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం ప్రకటించేంత వరకూ పోరాడదామని.. గుంటూరు జిల్లా నరసారావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో స్పష్టం చేశారు. అమరావతి కోసం ఎందరో సొంత పనులు వదులుకుని పోరాడుతున్నారని.. ఈ ఉద్యమం వ్యక్తిదో.. పార్టీదో కాదని చెప్పారు. ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు.

డీజీపీ చెప్పారని మహిళలను కొడతారా?

డీజీపీ చెప్పారని మహిళలను కొడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మీకు కుటుంబ సభ్యులు లేరా అని పోలీసులను అడిగారు. తమ పార్టీ కార్యాలయం వద్ద 200 మంది పోలీసులను ఉంచారని.. ప్రభుత్వం బెదిరించాలని చూస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదని గతంలో జగన్ చెప్పారని.. ఇప్పుడు పోలీసులతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నేనెప్పుడూ తప్పు చేయను.. చట్టాన్ని గౌరవిస్తా. అమరావతిలో ఉన్న లోపం ఏమిటి?.. ఎందుకు మారుస్తున్నారు? అమరావతి కాపాడుకోవాలని మాత్రమే నేను అడుగుతున్నా. రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం.. అమరావతి. 13 జిల్లాలకూ అందుబాటులో ఉన్న ప్రాంతం.. అమరావతి. వైకాపా తప్ప అన్ని పార్టీలూ అమరావతి ఉద్యమానికి సహకరిస్తున్నాయి.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

విశాఖ ప్రజలు ఎప్పుడూ రాజధాని అడగలేదని చంద్రబాబు అన్నారు. విశాఖకు ఎన్నో సంస్థలు తేవాలని అనుకున్నాం... వైకాపా అన్నీ రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రజలకు సాగునీరు, ఉద్యోగాలు కావాలన్నారు.

'మీ పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడుతున్నా'

ఇలాంటి సీఎంను చూడలేదు

'40 ఏళ్ల జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. అమరావతి పరిరక్షణకు యువత, విద్యార్థులు ముందుకు రావాలి. రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. అమరావతిలో ఏమీ కట్టనక్కరలేదు. మా ప్రభుత్వంలో 130 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. అమరావతిలో అన్నీ పోగా 10 వేల ఎకరాలు మిగులుతాయి.. అదే పెద్ద సంపద. హైదరాబాద్‌ను చేసినట్లే అమరావతిని అభివృద్ధి చేయాలని అనుకున్నా.' అని చంద్రబాబు తెలిపారు.

ఇన్​సైడర్ ట్రేడింగ్​పై దర్యాప్తు చేయండి

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని రైతులను అవమానం చేసేవాళ్లు అడ్రస్‌ లేకుండా పోతారని వ్యాఖ్యానించారు. రైతులపై నోరు పారేసుకుంటే చరిత్రహీనులుగా మిగులిపోతారని చంద్రబాబు హెచ్చరించారు.

'ప్రతి గ్రామం.. మరో తుళ్లూరు, మరో మందడం కావాలి. ప్రతి టౌన్‌.. మరో విజయవాడ, మరో గుంటూరు కావాలి. ఎవరిని అరెస్టు చేసినా అందరూ వెళ్లి పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేయాలి. అమరావతి సాధనే మనందరి లక్ష్యం కావాలి. అమరావతి కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలోకి రావాలి. నరసరావుపేటలో నగదు రూపంలో రూ.12.4 లక్షల విరాళం వచ్చింది. అమరావతి ఇటుకలకు వచ్చిన డబ్బు రూ.57 కోట్లు సీఆర్‌డీఏకు ఇచ్చాం. అమరావతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వందమందిని సమీకరించాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

57 కోట్లు సీఆర్డీఏకి ఇచ్చాం

బోస్టన్ నివేదికలను భోగి మంటల్లో వేయాలి

బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ బోగస్ కమిటీ అని చంద్రబాబు విమర్శించారు. ఈ కమిటీ నివేదికలను భోగిమంటల్లో వేయాలని పిలుపునిచ్చారు. విరాళాలు ఐకాస బ్యాంకు ఖాతాలకు ఇవ్వవచ్చని తెలిపారు. అమరావతిని ఎవరూ మార్చలేరు.. ఆ శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐకాసకు ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అమరావతి ఉద్యమం: జోలెపట్టి జనంలోకి చంద్రబాబు

జై అమరావతి అనేది.. అందరి నినాదం కావాలని రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం ప్రకటించేంత వరకూ పోరాడదామని.. గుంటూరు జిల్లా నరసారావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో స్పష్టం చేశారు. అమరావతి కోసం ఎందరో సొంత పనులు వదులుకుని పోరాడుతున్నారని.. ఈ ఉద్యమం వ్యక్తిదో.. పార్టీదో కాదని చెప్పారు. ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు.

డీజీపీ చెప్పారని మహిళలను కొడతారా?

డీజీపీ చెప్పారని మహిళలను కొడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మీకు కుటుంబ సభ్యులు లేరా అని పోలీసులను అడిగారు. తమ పార్టీ కార్యాలయం వద్ద 200 మంది పోలీసులను ఉంచారని.. ప్రభుత్వం బెదిరించాలని చూస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదని గతంలో జగన్ చెప్పారని.. ఇప్పుడు పోలీసులతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నేనెప్పుడూ తప్పు చేయను.. చట్టాన్ని గౌరవిస్తా. అమరావతిలో ఉన్న లోపం ఏమిటి?.. ఎందుకు మారుస్తున్నారు? అమరావతి కాపాడుకోవాలని మాత్రమే నేను అడుగుతున్నా. రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం.. అమరావతి. 13 జిల్లాలకూ అందుబాటులో ఉన్న ప్రాంతం.. అమరావతి. వైకాపా తప్ప అన్ని పార్టీలూ అమరావతి ఉద్యమానికి సహకరిస్తున్నాయి.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

విశాఖ ప్రజలు ఎప్పుడూ రాజధాని అడగలేదని చంద్రబాబు అన్నారు. విశాఖకు ఎన్నో సంస్థలు తేవాలని అనుకున్నాం... వైకాపా అన్నీ రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రజలకు సాగునీరు, ఉద్యోగాలు కావాలన్నారు.

'మీ పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడుతున్నా'

ఇలాంటి సీఎంను చూడలేదు

'40 ఏళ్ల జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. అమరావతి పరిరక్షణకు యువత, విద్యార్థులు ముందుకు రావాలి. రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. అమరావతిలో ఏమీ కట్టనక్కరలేదు. మా ప్రభుత్వంలో 130 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. అమరావతిలో అన్నీ పోగా 10 వేల ఎకరాలు మిగులుతాయి.. అదే పెద్ద సంపద. హైదరాబాద్‌ను చేసినట్లే అమరావతిని అభివృద్ధి చేయాలని అనుకున్నా.' అని చంద్రబాబు తెలిపారు.

ఇన్​సైడర్ ట్రేడింగ్​పై దర్యాప్తు చేయండి

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని రైతులను అవమానం చేసేవాళ్లు అడ్రస్‌ లేకుండా పోతారని వ్యాఖ్యానించారు. రైతులపై నోరు పారేసుకుంటే చరిత్రహీనులుగా మిగులిపోతారని చంద్రబాబు హెచ్చరించారు.

'ప్రతి గ్రామం.. మరో తుళ్లూరు, మరో మందడం కావాలి. ప్రతి టౌన్‌.. మరో విజయవాడ, మరో గుంటూరు కావాలి. ఎవరిని అరెస్టు చేసినా అందరూ వెళ్లి పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేయాలి. అమరావతి సాధనే మనందరి లక్ష్యం కావాలి. అమరావతి కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలోకి రావాలి. నరసరావుపేటలో నగదు రూపంలో రూ.12.4 లక్షల విరాళం వచ్చింది. అమరావతి ఇటుకలకు వచ్చిన డబ్బు రూ.57 కోట్లు సీఆర్‌డీఏకు ఇచ్చాం. అమరావతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వందమందిని సమీకరించాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

57 కోట్లు సీఆర్డీఏకి ఇచ్చాం

బోస్టన్ నివేదికలను భోగి మంటల్లో వేయాలి

బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ బోగస్ కమిటీ అని చంద్రబాబు విమర్శించారు. ఈ కమిటీ నివేదికలను భోగిమంటల్లో వేయాలని పిలుపునిచ్చారు. విరాళాలు ఐకాస బ్యాంకు ఖాతాలకు ఇవ్వవచ్చని తెలిపారు. అమరావతిని ఎవరూ మార్చలేరు.. ఆ శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐకాసకు ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అమరావతి ఉద్యమం: జోలెపట్టి జనంలోకి చంద్రబాబు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.