వైరల్: పర్యటకులను ఛేజ్ చేసిన ఏనుగు - తల్లి
🎬 Watch Now: Feature Video
కర్ణాటక మైసూర్లోని నాగర్హొల్ జాతీయ పార్కులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అటవీ జంతువులను చూడటానికి వాహనంలో బయలుదేరారు పర్యటకులు. దారిలో ఓ ఏనుగుల గుంపు వారికి కనపడింది. వెంటనే ఆ గుంపును ఫొటో తీయడానికి చరవాణీలు బయటకు తీశారు. ఇది గమనించిన ఏనుగులు ఏదో ఆపద పొంచి ఉందనుకుని భయపడ్డాయి. గుంపులోని తల్లి ఏనుగు వెంటనే అప్రమత్తమై వాహనం వైపు పరుగు తీసింది. ఈ దృశ్యాలు పర్యటకుల ఫోన్లలో చిక్కాయి.