రెవిన్యూ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. సమస్యాత్మక కేంద్రాలైన ఆలేరు, మోటకొండూర్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
పోలింగ్ బూత్ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సీపీ ఆదేశించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను నల్గొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తామని తెలిపారు. సీపీ వెంట డీసీపీ నారాయణరెడ్డి ఉన్నారు.
ఇదీ చదవండి: రేపటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు..