యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు భాజపా మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి సేవా సంఘటన్లో భాగంగా తనవంతు సాయం చేశారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ సెంటర్లో మల్టీ విటమిన్ మాత్రలు, శానిటైజర్లు, మాస్కులు, వైద్యులకు గ్లౌజుల కొరత ఉందని తెలుసుకున్న మల్లారెడ్డి వెంటనే స్పందించి 50 వేల రూపాయల విలువగల సామాగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు తుమ్మల మురళీధర్ రెడ్డి, గజరాజు కాశీనాథ్, నాతి బిక్షపతి గౌడ్, దయ్యాల కుమారస్వామి, సత్తిరెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం