ETV Bharat / state

నేతన్నల జీవితాల్లో వెలుగేది...? - powerloom workers

దశాబ్దాల కాలంగా వారి బాధలు ఎవరికీ పట్టడం లేదు... పొట్టకూటి కోసం ఇల్లూ వాకిలి వదిలి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వాళ్ల వెతలు తీరడం లేదు.. ఏదో చేస్తాం అండగా ఉంటాం అని మాట ఇచ్చిన నేతలు ఇప్పుడు ఏమయ్యారు. వారం రోజులు సూరత్​లో మకాం వేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న నేతల జాడేది. నాయకుల మాటలు నమ్మి సూరత్ భీమండిలో ఆస్తులను అమ్ముకొని స్వగ్రామానికి వచ్చిన నేతన్నల పరిస్థితి ఏంటి.. అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నా జేబుల్లోకి 100 రూపాయలు రాని పరిస్థితి వారిది.

powerloom workers facing problems in warangal rural district
నేతన్నల జీవితాల్లో వెలుగేది...?
author img

By

Published : Feb 18, 2020, 5:32 AM IST

నేతన్నల జీవితాల్లో వెలుగేది...?

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామం నాలుగు దశాబ్దాల క్రితం వేలాది మంది చేనేత కార్మికులతో కళకళలాడేది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాల నుంచి ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం... ఉత్పత్తుల తయారీకి మూడు సరుకు ధరలు పెరగడం... గిరాకీ తగ్గడం... వంటి పలు కారణాలతో పూట గడవడమే కష్టంగా మారింది. చేసేది లేక పొట్ట చేత పట్టుకొని భీమండి, సూరత్ పట్టణాలకు వలస బాట పట్టారు నేతన్నలు. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వరకు అక్కడే జీవనం కొనసాగించారు. అక్కడి బట్టల తయారీ మిల్లుల్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం వల్ల నేతన్నలు రాష్ట్రంలో సగర్వంగా జీవించాలన్న ఆలోచనతో కొందరు స్వగ్రామానికి తరలివచ్చారు.. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని గ్రామంలోనే జీవించారు.

భరోసా ఇచ్చారు... తిరిగొచ్చారు

జిల్లాలో టెక్స్​టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అప్పటి రాష్ట్ర మంత్రుల బృందం 2014లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్​లో పర్యటించారు. వారిలో జిల్లాకు చెందిన అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వలస తెలంగాణ కార్మికులను కలిశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు సబ్సిడీ, మార్కెటింగ్ సౌకర్యం, రుణ సాయంతో పాటు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించడంతో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గత కొన్నేళ్లుగా అక్కడ సంపాదించుకున్న ఆస్తులను అమ్ముకొని ఉన్న ఉద్యోగాలను వదులుకొని నేతల మాటలను నమ్మి వచ్చిన కార్మికులకు నిరాశే మిగిలిందని నేతన్నలు వాపోతున్నారు.

రోడ్డున పడే పరిస్థితి

పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని ప్రభుత్వ తోడ్పాటు కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం వల్ల అప్పులు చేసి మరీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నామని వారు తెలిపారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని మాటిచ్చిన నాయకులు ఇప్పుడు వెళితే పట్టించుకోవడంలేదని... ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. అప్పుడు వారు చేసిన మోసానికి ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

మార్కెటింగ్​ సౌకర్యం కల్పించండి

నాలుగేళ్ల క్రితం కొందరు నేతన్నలు కలిసి జై మార్కండేయ పద్మశాలి పవర్​లూమ్స్ ఇండస్ట్రియల్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు 102 మంది సభ్యులు కోటి రూపాయల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆర్థిక స్థోమత సరిగా లేక మిగతా కార్మికులు వెనుకడుగు వేశారు. 16 మంది కలిసి ఎకరం స్థలంలో 80 లక్షలతో షెడ్లు నిర్మాణం చేసుకున్నారు. అందులో ఒక కోటి 60 లక్షలతో 16 ప్లాంట్లను నిర్మించి 160 పవర్​లూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సొసైటీ ద్వారా 150 మంది కార్మికులకు ఉపాధి లభిస్తున్నా.. వారు ఉత్పత్తి చేసిన సరుకులకు మార్కెటింగ్ సౌకర్యం లేక... గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం చేయకపోయినా... కనీసం తమ వద్ద తయారైన వస్త్రాలకు సరైన గిట్టుబాటు ధరతో పాటు విక్రయించుకునేందుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని యజమానులు కోరుతున్నారు.

టెక్స్​టైల్​ మార్కెట్​పై ఆశలు

వరంగల్ గ్రామీణ జిల్లాలో టెక్స్​టైల్​ పార్కు ఏర్పాటుపై నేతన్నలు ఇప్పుడు కోటి ఆశలు పెట్టుకున్నారు. టెక్స్​టైల్ పార్కు పడడం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని... ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: రంగెలిసిన నేతన్న బతుకు సప్తవర్ణమెలా అయ్యిందంటే...

నేతన్నల జీవితాల్లో వెలుగేది...?

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామం నాలుగు దశాబ్దాల క్రితం వేలాది మంది చేనేత కార్మికులతో కళకళలాడేది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాల నుంచి ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం... ఉత్పత్తుల తయారీకి మూడు సరుకు ధరలు పెరగడం... గిరాకీ తగ్గడం... వంటి పలు కారణాలతో పూట గడవడమే కష్టంగా మారింది. చేసేది లేక పొట్ట చేత పట్టుకొని భీమండి, సూరత్ పట్టణాలకు వలస బాట పట్టారు నేతన్నలు. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వరకు అక్కడే జీవనం కొనసాగించారు. అక్కడి బట్టల తయారీ మిల్లుల్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం వల్ల నేతన్నలు రాష్ట్రంలో సగర్వంగా జీవించాలన్న ఆలోచనతో కొందరు స్వగ్రామానికి తరలివచ్చారు.. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని గ్రామంలోనే జీవించారు.

భరోసా ఇచ్చారు... తిరిగొచ్చారు

జిల్లాలో టెక్స్​టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అప్పటి రాష్ట్ర మంత్రుల బృందం 2014లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్​లో పర్యటించారు. వారిలో జిల్లాకు చెందిన అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వలస తెలంగాణ కార్మికులను కలిశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు సబ్సిడీ, మార్కెటింగ్ సౌకర్యం, రుణ సాయంతో పాటు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించడంతో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గత కొన్నేళ్లుగా అక్కడ సంపాదించుకున్న ఆస్తులను అమ్ముకొని ఉన్న ఉద్యోగాలను వదులుకొని నేతల మాటలను నమ్మి వచ్చిన కార్మికులకు నిరాశే మిగిలిందని నేతన్నలు వాపోతున్నారు.

రోడ్డున పడే పరిస్థితి

పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని ప్రభుత్వ తోడ్పాటు కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం వల్ల అప్పులు చేసి మరీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నామని వారు తెలిపారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని మాటిచ్చిన నాయకులు ఇప్పుడు వెళితే పట్టించుకోవడంలేదని... ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. అప్పుడు వారు చేసిన మోసానికి ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

మార్కెటింగ్​ సౌకర్యం కల్పించండి

నాలుగేళ్ల క్రితం కొందరు నేతన్నలు కలిసి జై మార్కండేయ పద్మశాలి పవర్​లూమ్స్ ఇండస్ట్రియల్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు 102 మంది సభ్యులు కోటి రూపాయల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆర్థిక స్థోమత సరిగా లేక మిగతా కార్మికులు వెనుకడుగు వేశారు. 16 మంది కలిసి ఎకరం స్థలంలో 80 లక్షలతో షెడ్లు నిర్మాణం చేసుకున్నారు. అందులో ఒక కోటి 60 లక్షలతో 16 ప్లాంట్లను నిర్మించి 160 పవర్​లూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సొసైటీ ద్వారా 150 మంది కార్మికులకు ఉపాధి లభిస్తున్నా.. వారు ఉత్పత్తి చేసిన సరుకులకు మార్కెటింగ్ సౌకర్యం లేక... గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం చేయకపోయినా... కనీసం తమ వద్ద తయారైన వస్త్రాలకు సరైన గిట్టుబాటు ధరతో పాటు విక్రయించుకునేందుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని యజమానులు కోరుతున్నారు.

టెక్స్​టైల్​ మార్కెట్​పై ఆశలు

వరంగల్ గ్రామీణ జిల్లాలో టెక్స్​టైల్​ పార్కు ఏర్పాటుపై నేతన్నలు ఇప్పుడు కోటి ఆశలు పెట్టుకున్నారు. టెక్స్​టైల్ పార్కు పడడం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని... ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: రంగెలిసిన నేతన్న బతుకు సప్తవర్ణమెలా అయ్యిందంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.