ETV Bharat / state

'పార్టీ గుర్తించింది... ప్రథమ సేవకురాలిని అయ్యాను' - CHAIR_PARSAN_EMPIKA

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పురపాలికలో తెరాస అభ్యర్థి గుంటి రజిని బెస్త ఛైర్​ పర్సన్​గా ఎన్నికయ్యారు.  రాష్ట్రం కోసం ఉద్యమించి... పార్టీ తరఫునా సేవలందించిన తమను అధిష్ఠానం గుర్తించిందన్నారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా నూతన ఛైర్ పర్సన్ తెలిపారు.

'పార్టీ ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం'
'పార్టీ ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం'
author img

By

Published : Jan 27, 2020, 8:19 PM IST

Updated : Jan 27, 2020, 8:26 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పురపాలికలో తెరాస అభ్యర్థులు... గుంటి రజని బెస్త, మునిగాల వెంకట్ రెడ్డిలు ఛైర్ పర్సన్​, వైస్ ఛైర్మన్​గా ఎంపికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపికైన సభ్యులతో ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

మొత్తం 24 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఈ ఎన్నికలో పాల్గొన్నారు. తెరాస 16, స్వతంత్రులు ఇద్దరు, ఒక ఎక్స్అఫిషియో సభ్యుడితో కలిపి మొత్తం 19 మంది చేతిలెత్తి ఓటేశారు. ఫలితంగా గుంటి రజని బెస్త ఛైర్ పర్సన్​గా ఎన్నికయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా...

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తమకు ఈ బాధ్యత అప్పగించడంపై నూతన ఛైర్​ పర్సన్ గుంటి రజిని బెస్త ఆనందం వ్యక్తం చేశారు. తాము తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో ఉప సర్పంచ్​, సర్పంచ్​, వార్డు కౌన్సిలర్ గానూ విధులు నిర్వహించామని పేర్కొన్నారు. తమపై పార్టీ పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పుర ప్రజలకు, పార్టీకి సేవ చేస్తానని... నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్ స్పష్టం చేశారు.

'పార్టీ ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం'

ఇవీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పురపాలికలో తెరాస అభ్యర్థులు... గుంటి రజని బెస్త, మునిగాల వెంకట్ రెడ్డిలు ఛైర్ పర్సన్​, వైస్ ఛైర్మన్​గా ఎంపికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపికైన సభ్యులతో ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

మొత్తం 24 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఈ ఎన్నికలో పాల్గొన్నారు. తెరాస 16, స్వతంత్రులు ఇద్దరు, ఒక ఎక్స్అఫిషియో సభ్యుడితో కలిపి మొత్తం 19 మంది చేతిలెత్తి ఓటేశారు. ఫలితంగా గుంటి రజని బెస్త ఛైర్ పర్సన్​గా ఎన్నికయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా...

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తమకు ఈ బాధ్యత అప్పగించడంపై నూతన ఛైర్​ పర్సన్ గుంటి రజిని బెస్త ఆనందం వ్యక్తం చేశారు. తాము తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో ఉప సర్పంచ్​, సర్పంచ్​, వార్డు కౌన్సిలర్ గానూ విధులు నిర్వహించామని పేర్కొన్నారు. తమపై పార్టీ పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పుర ప్రజలకు, పార్టీకి సేవ చేస్తానని... నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్ స్పష్టం చేశారు.

'పార్టీ ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం'

ఇవీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు

sample description
Last Updated : Jan 27, 2020, 8:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.