ETV Bharat / state

'మినీ స్టేడియం అందని ద్రాక్షగా మిగిలింది' - MINI STADUIM BJP PARISHILANA

హుస్నాబాద్ పట్టణంలో శంకుస్థాపన చేసినా... మినీ స్టేడియం క్రీడాకారులకు అందని ద్రాక్షగా మారిందని భాజపా పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ ఆరోపించారు. 2018లో ప్రారంభించిన పనులు ఇంతవరకు పూర్తికాలేదన్నారు.

mini-stadium-remains-grapevine-at-husanabad
'మినీ స్టేడియం అందని ద్రాక్షగా మిగిలింది'
author img

By

Published : Nov 30, 2019, 11:44 PM IST

హుస్నాబాద్ పట్టణంలోని మినీస్టేడియాన్ని ఈరోజు భాజపా పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్​తో పాటు పలువురు నేతలు సందర్శించారు. పట్టణ ప్రాంత ప్రజలు ఉదయం భయం భయంగా రోడ్డుపైనే మార్నింగ్ వాక్​కి వెళ్తున్నారని, మైదానం లేక క్రీడాకారులు నగరాల బాట పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి హయాంలో భవనాలకు రూ.99 లక్షలు మంజూరు కాగా గోడలు కట్టి వదిలేసారని అన్నారు.

2018 సంవత్సరంలో ఎమ్మెల్యే సతీష్ మిగులు పనులకు రూ.కోటి మంజూరు చేసినా పనులు ఇంకా పూర్తికాలేదని ఆరోపించారు. మినీ స్టేడియం హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కలగానే మిగిలిపోయిందన్నారు. మంత్రి, ఎమ్మెల్యే గారు స్పందించి మినీ స్టేడియాన్ని వెంటనే పూర్తి చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.

'మినీ స్టేడియం అందని ద్రాక్షగా మిగిలింది'

ఇదీ చూడండి : 'పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి'

హుస్నాబాద్ పట్టణంలోని మినీస్టేడియాన్ని ఈరోజు భాజపా పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్​తో పాటు పలువురు నేతలు సందర్శించారు. పట్టణ ప్రాంత ప్రజలు ఉదయం భయం భయంగా రోడ్డుపైనే మార్నింగ్ వాక్​కి వెళ్తున్నారని, మైదానం లేక క్రీడాకారులు నగరాల బాట పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి హయాంలో భవనాలకు రూ.99 లక్షలు మంజూరు కాగా గోడలు కట్టి వదిలేసారని అన్నారు.

2018 సంవత్సరంలో ఎమ్మెల్యే సతీష్ మిగులు పనులకు రూ.కోటి మంజూరు చేసినా పనులు ఇంకా పూర్తికాలేదని ఆరోపించారు. మినీ స్టేడియం హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కలగానే మిగిలిపోయిందన్నారు. మంత్రి, ఎమ్మెల్యే గారు స్పందించి మినీ స్టేడియాన్ని వెంటనే పూర్తి చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.

'మినీ స్టేడియం అందని ద్రాక్షగా మిగిలింది'

ఇదీ చూడండి : 'పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి'

Intro:TG_KRN_102_30_MINI STADIUM_BJP PARISHILANA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------------------------
హుస్నాబాద్ క్రీడాకారులకు అందని ద్రాక్షగా మారిన మినీ స్టేడియం
హుస్నాబాద్ పట్టణంలోని మీనీస్టేడియాన్ని ఈ రోజు భాజపా ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఉదయం భయంభయంగా రోడ్డుపైనే మార్నింగ్ వాక్ కి వెళ్తున్నారని, మైదానం లేక క్రీడాకారులు నగరాల బాట పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి గారి హయాంలో పైకా భవనాలకు రూ.99లక్షలు మంజూరు కాగా గోడలు కట్టి, ఒక్క భవనం పైకప్పు కట్టి వదిలేసారని, ఆ తరువాత 2010 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గారు మిగులు పనులకు రూ.1కోటి 10లక్షలు మంజూరు చెయ్యగా, ఆ తరువాత 2017 సంవత్సరంలో ఎమ్మెల్యే సతీష్ గారు మళ్లా మిగులు పనులకు రూ.కోటి మంజూరు చేసిన పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. అసంపూర్తిగా ఉన్న రూమ్ లను కట్టి బాస్కెట్ బాల్, జిమ్ సెంటర్ కు ఫిల్లర్లు లేపి గాలికి వదిలేసారని, మినీ స్టేడియం హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కళగానే మిగులిపోయి, మరుగునపడిపోయిందన్నారు. జిల్లాల విభజన తరువాత స్టేడియంలో నిర్మించిన గదిలో ఎంవీఐ కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారని, జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఇటీవల హుస్నాబాద్ లో పర్యాటించగా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి గారి మాటలను పట్టించుకున్న అధికారే లేడని ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యే గారు స్పందించి మినీ స్టేడియాన్ని పూర్తి చేయాలని భాజపా పక్షాన డిమాండ్ చేశారు.Body:బైట్

1) హుస్నాబాద్ భాజపా పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్Conclusion: హుస్నాబాద్ లో మినీ స్టేడియం ను పరిశీలించిన భాజపా నాయకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.