రెండవ బాసరగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని అమ్మవారిని దర్శఇంచుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో విద్యాధరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం