తల్లి పాలు పట్టడం ద్వారా అండాశయ, రొమ్ము క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుందని డాక్టర్ ప్రసన్నారెడ్డి అన్నారు. సరైన అవగాహన లేక.. అనేక మంది శిశువులు ఏడాదిలోపే మృతి చెందుతున్నారని ఆవేదన చెందారు. తల్లి పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయని తెలిపారు. సిద్దిపేటలో ఈనాడు వసుంధనర కుటుంబం- ప్యాంపర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఈనాడు మేనేజర్ వెంకటేశ్వరావు, హైదరాబాద్ ఈనాడు మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : వాగులు, వంకలు దాటి.. ప్రసవ వేదన అనుభవించి..