ETV Bharat / state

'బద్ది పోచమ్మకు బహుజన పూజారుల ఆధ్వర్యంలో బోనాలు' - VEMULAWADA

బహుజన పూజారుల సేవాసమితి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. శివసత్తులవి న్యాయమైన కోరికలుగా భావించి వారిని అదుకోవాలని కరీంనగర్ ఎంపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

శివ సత్తులతో కలిసి బోనం ఎత్తుకున్న ఎంపీ బండి సంజయ్
author img

By

Published : Jun 7, 2019, 12:03 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బహుజన పూజారుల సేవాసమితి ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. మెుత్తం 2116 మంది శివ సత్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ నుంచి పట్టణ వీధుల గుండా నెత్తిన బోనాలతో తమ సమస్యలను నెరవేర్చాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హజరయ్యారు.
ఈ సందర్భంగా శివ సత్తులతో కలిసి ఎంపీ బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరి కష్టాలు తొలగి దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే అమ్మ వారిని వేడుకున్నానని ఎంపీ స్పష్టం చేశారు.

శివసత్తులవి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వమే పరిష్కరించాలి

ఇవీ చూడండి : కాంగ్రెస్​ నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బహుజన పూజారుల సేవాసమితి ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. మెుత్తం 2116 మంది శివ సత్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ నుంచి పట్టణ వీధుల గుండా నెత్తిన బోనాలతో తమ సమస్యలను నెరవేర్చాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హజరయ్యారు.
ఈ సందర్భంగా శివ సత్తులతో కలిసి ఎంపీ బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరి కష్టాలు తొలగి దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే అమ్మ వారిని వేడుకున్నానని ఎంపీ స్పష్టం చేశారు.

శివసత్తులవి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వమే పరిష్కరించాలి

ఇవీ చూడండి : కాంగ్రెస్​ నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.