సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గోదావరి ఓడ్డున ఉన్న సురాబాండేశ్వరాలయంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి, శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, అలాంటి మహోన్నత వ్యక్తి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు. పేద ప్రజల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆయనకు కొండంత బలాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పుట్ట మధు అన్నారు.