ETV Bharat / state

'కేసీఆర్​ త్వరగా కోలుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి'

author img

By

Published : Apr 22, 2021, 1:26 PM IST

సీఎం కేసీఆర్​ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు దంపతులు మంథనిలోని సురాబాండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేద ప్రజల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయని ఛైర్మన్​ అన్నారు.

putta madhu pujas for cm kcr health
సీఎం కేసీఆర్​ కోసం పుట్ట మధు ప్రత్యేక పూజలు

సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గోదావరి ఓడ్డున ఉన్న సురాబాండేశ్వరాలయంలో జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి, శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, అలాంటి మహోన్నత వ్యక్తి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు. పేద ప్రజల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆయనకు కొండంత బలాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పుట్ట మధు అన్నారు.

సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గోదావరి ఓడ్డున ఉన్న సురాబాండేశ్వరాలయంలో జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి, శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, అలాంటి మహోన్నత వ్యక్తి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు. పేద ప్రజల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆయనకు కొండంత బలాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పుట్ట మధు అన్నారు.

ఇదీ చదవండి: 'నేలతల్లి బాగుంటేనే.. భావితరాలకు మంచి భవిష్యత్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.