నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లలోని బాధితుల ఆచూకీ కోసం వారి కుటుంబాలు విలపిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలో తమ పిల్లలు కనిపించారని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు... అక్కడ దాడికి పాల్పడిన వారిని ఎందుకు వదిలేశారని నిలదీశాయి.
అత్యవసర పరిస్థితుల్లో ఆత్మరక్షణకు ప్రయత్నించడం నేరమవుతుందా అని గోకుల్ తల్లి సురేఖ ప్రశ్నించింది. పోలీసులు వెంటనే స్పందించి... తమ వారు ఎక్కడున్నారో తెలపకపోతే బలవన్మరణానికి పాల్పడతామని హెచ్చరించింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆరు కొత్త ఎయిర్ పోర్టులు అభివృద్ధి