నారాయణపేట జిల్లా పేరపల్ల మండలంలో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనం మీద నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బెల్లం స్వాధీనం చేసుకొని, వారిని అరెస్టు చేశారు. ఏడు లీటర్ల నాటుసారా, 80 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై గంగాధర్ తెలిపారు.
ఇదీ చూడండి: సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా