ETV Bharat / state

పోషకాహారంపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి: కలెక్టర్‌ - పోషకాహారంపై ప్రచారం

పోషకాహార విలువలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని అంగన్‌వాడీ సిబ్బందికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

Mancherial dist collector bharathi hollikeri awareness nutrition  programme on taking of healthy  food
పోషకాహారంపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి: కలెక్టర్
author img

By

Published : Mar 24, 2021, 3:56 PM IST

బాలింతలకు, శిశువులకు అందించే పోషకాహారంపై అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

పౌష్టికాహారం గురించి తెలియజేసే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లల్లో పౌష్టికాహారం లోపం రాకుండా కృషి చేస్తామని పాలనాధికారితో పాటు అంగన్‌వాడీ సిబ్బంది, యువత ప్రతిజ్ఞ చేశారు. పోషణ పక్షోత్సవాల్లో కిశోర బాలికలకు, బాలింతలకు, శిశువులకు పోషకాహార విలువలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు.

ఇదీ చూడండి: థియేటర్ల మూసివేతపై స్పష్టతనిచ్చిన మంత్రి తలసాని

బాలింతలకు, శిశువులకు అందించే పోషకాహారంపై అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

పౌష్టికాహారం గురించి తెలియజేసే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లల్లో పౌష్టికాహారం లోపం రాకుండా కృషి చేస్తామని పాలనాధికారితో పాటు అంగన్‌వాడీ సిబ్బంది, యువత ప్రతిజ్ఞ చేశారు. పోషణ పక్షోత్సవాల్లో కిశోర బాలికలకు, బాలింతలకు, శిశువులకు పోషకాహార విలువలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు.

ఇదీ చూడండి: థియేటర్ల మూసివేతపై స్పష్టతనిచ్చిన మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.