ETV Bharat / state

ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ - ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఇరు అభ్యర్థుల అనుచరులు బాహాబాహీకి దిగటం వల్ల ఘర్షణ వాతావరణం నెలకొంది.

Tension Weather in Mahabubnagar Municipal Elections
ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ
author img

By

Published : Jan 22, 2020, 3:36 PM IST

మహబూబ్ నగర్ పట్టణంలోని 29వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి అనుచరులకు, స్వతంత్ర అభ్యర్థి అనుచరులకు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఎంఐఎంకు చెందిన అనుచరులు బోగస్ ఓట్లు వేస్తున్నారని వారు ఆరోపించారు. విధుల్లో ఉన్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొనిపోవటం వల్ల పట్టణ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు బలగాలను మోహరించారు.

ఎంఐఎం అభ్యర్థి ఇంట్లో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇంటిని సోదా చేసేందుకు వెళ్లగా... అభ్యర్థి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వెనుతిరిగిన పోలీసులు... ఎన్నికల తనిఖీ బృందాలకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు బృందాలు ఇంటిని సోదా చేశారు. ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన అధికారులకు వారంతా తమ బంధువులు అంటూ బుకాయించారు. ఆ ఇంటి నుంచి అందరినీ బయటకు పంపటం వల్ల వివాదం సద్దుమణిగింది. పోలీసులు, తనిఖీ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

మహబూబ్ నగర్ పట్టణంలోని 29వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి అనుచరులకు, స్వతంత్ర అభ్యర్థి అనుచరులకు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఎంఐఎంకు చెందిన అనుచరులు బోగస్ ఓట్లు వేస్తున్నారని వారు ఆరోపించారు. విధుల్లో ఉన్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొనిపోవటం వల్ల పట్టణ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు బలగాలను మోహరించారు.

ఎంఐఎం అభ్యర్థి ఇంట్లో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇంటిని సోదా చేసేందుకు వెళ్లగా... అభ్యర్థి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వెనుతిరిగిన పోలీసులు... ఎన్నికల తనిఖీ బృందాలకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు బృందాలు ఇంటిని సోదా చేశారు. ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన అధికారులకు వారంతా తమ బంధువులు అంటూ బుకాయించారు. ఆ ఇంటి నుంచి అందరినీ బయటకు పంపటం వల్ల వివాదం సద్దుమణిగింది. పోలీసులు, తనిఖీ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

Intro:TG_Mbnr_02_22_Udrikthatha_In_Elections_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 29వ వార్డు లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఇరు అభ్యర్థుల అనుచరులు బాహాబహికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.


Body:మహబూబ్ నగర్ పట్టణంలోని 29వ వార్డు మదీనా మజీద్ ఎంఐఎం అభ్యర్థి అనుచరులు ఇతర ప్రాంతాల నుంచి బోగస్ ఓటర్లను తీసుకువచ్చి ఓటు వేయిస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి ఆరోపించడంతో... ఇరువురు అభ్యర్థుల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దింతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పట్టణ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు బలగాలను మోహరించారు.


Conclusion:ఎంఐఎం అభ్యర్థి ఇంట్లో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇంటిని సోదా చేసేందుకు వెళ్లగా.. అభ్యర్థి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వెనుతిరిగిన పోలీసులు... ఎన్నికల తనిఖీ బృందాలకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు బృందాలు ఇంటిని సోదా చేశాయి. ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్టు గుర్తించిన అధికారులకు వారంతా తమ బంధువులు అంటూ బుకాయించారు. ఆ ఇంటి నుంచి అందరినీ బయటకు పంపడంతో వివాదం సద్దుమణిగింది. దింతో పోలీసులు, తనిఖీ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి.....spot

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.