ETV Bharat / state

యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు - యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు

యూరియా కొరత, రైతు సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్​ నిరసన బాట పట్టింది. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్​ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు
author img

By

Published : Sep 11, 2019, 10:47 PM IST

దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్​ కార్యాలయం నుంచి అంబేడ్కర్​ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు. బడ్జెట్​ కేటాయింపుల్లో వ్యవసాయానికి తక్కువ కేటాయింపులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్​ నేతల ఆందోళనతో ప్రధాన రహదారిపై కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.

యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు

ఇవీ చూడండి: అటవీ అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి

దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్​ కార్యాలయం నుంచి అంబేడ్కర్​ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు. బడ్జెట్​ కేటాయింపుల్లో వ్యవసాయానికి తక్కువ కేటాయింపులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్​ నేతల ఆందోళనతో ప్రధాన రహదారిపై కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.

యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు

ఇవీ చూడండి: అటవీ అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి

Intro:TG_Mbnr_05_11_Congress_Darna_On_Rythu_Bhandu_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. అప్పుల రాష్ట్రంగా చేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు.


Body:రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులకు ఇప్పటి వరకు రైతుబంధు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అన్నారు.


Conclusion:ప్రభుత్వం ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా... రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతులకు రుణాలు కల్పించడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ కల్పించకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయించిన నిధులు కూడా తక్కువెనని గా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి......byte
బైట్
ఒబెదుల్లా కొత్వాల్,
కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.