మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పూజల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేటిలో కన్నులపండువగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాన్ని వీక్షించారు.
ఇదీ చదవండిః శ్రీ భద్రకాళి ఆలయంలో ఘనంగా తెప్పోత్సవం