రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా వీఆర్ఓల సర్దుబాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వీఆర్ఓలు సోమవారం తమ ఆధీనంలోని భూరికార్డులను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించారు. ఈ ప్రక్రియ కేవలం 5 గంటల్లోనే పూర్తయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రికార్డుల అప్పగింత పూర్తయింది.
రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిపరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు తెరుచుకునే అవకాశాలు లేవు. ఈ నిర్ణయంతో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
అప్పగించిన ముఖ్యమైన రికార్డులు ఇవే..
- మాన్యూవల్ పహణి
- ధరణి పహణి ● 1బి ● ఫాం -7
- విరాసత్తో పాటు ఇతర పెండింగ్ దరఖాస్తులు
- గ్రామాల వారీగా రైతుల పూర్తి సమాచారం
ఇవీ చూడండి: నవ తెలంగాణే లక్ష్యంగా.. సంస్కరణలు, చట్టాలు