ETV Bharat / state

తెనాలిలో మాజీ ప్రధాని పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు

author img

By

Published : Oct 10, 2020, 12:45 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను తయారు చేశారు శిల్పులు. ఖమ్మం జిల్లాలో వీటిని ప్రతిష్ఠించనున్నారు.

తెనాలిలో మాజీ ప్రధాని పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు
తెనాలిలో మాజీ ప్రధాని పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో తయారయ్యాయి. సూర్య శిల్పశాలకు చెందిన శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ విగ్రహాలను రూపొందించారు. వీటి తయారీకి రెండు నెలల సమయం పట్టింది.

8 అడుగుల ఎత్తులో విగ్రహాలను తయారు చేశారు. గతంలోనూ చాలామంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేసిన అనుభవం వీరికి ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వీటిని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో తయారయ్యాయి. సూర్య శిల్పశాలకు చెందిన శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ విగ్రహాలను రూపొందించారు. వీటి తయారీకి రెండు నెలల సమయం పట్టింది.

8 అడుగుల ఎత్తులో విగ్రహాలను తయారు చేశారు. గతంలోనూ చాలామంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేసిన అనుభవం వీరికి ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వీటిని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి.
విదేశీ పక్షుల కిలకిలరావాలకు కేరాఫ్ ఉప్పలపాడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.