కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి అంబేడ్కర్ కూడలి వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వీరికి మున్సిపాలిటీ కార్మీకులు సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష