ETV Bharat / state

రైతు శ్రేయస్సే తెరాస ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

author img

By

Published : Apr 17, 2021, 2:27 PM IST

కరీంనగర్ జిల్లా గంగాధర మార్కెట్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.

mla sunke Ravi Shankar inaugurated grain purchase center, grain purchase center at Gangadhara market
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా ధాన్యం తూకం వేశారు. రైతులకు మాస్కులు, శానిటైజర్లు, గన్నీ సంచులు, మంచినీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. తేమ శాతంపై స్పష్టత వచ్చాక తూకం చేపట్టాలన్నారు. రైతులకు విలువైన సమాచారం అందించడానికే రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా ధాన్యం తూకం వేశారు. రైతులకు మాస్కులు, శానిటైజర్లు, గన్నీ సంచులు, మంచినీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. తేమ శాతంపై స్పష్టత వచ్చాక తూకం చేపట్టాలన్నారు. రైతులకు విలువైన సమాచారం అందించడానికే రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇదీచ చదవండి: ప్రజాబలం లేకనే దొంగ ఓట్లు అంటూ ఆరోపణలు: పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.