ETV Bharat / state

గట్టు పీహెచ్​సీ అరుదైన రికార్డు - gattu primary health care center

15 గంటల్లో 8 కాన్పులు చేసి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు పీహెచ్​సీ వైద్యులు రికార్డు నెలకొల్పారు. ఈ కాన్పుల్లో 4 మంది మగశిశువులు, 4 మంది ఆడ శిశువులు జన్మించినట్లు వైద్యాధికారి రాజసింహ తెలిపారు.

గట్టు పీహెచ్​సీ అరుదైన రికార్డు
గట్టు పీహెచ్​సీ అరుదైన రికార్డు
author img

By

Published : Jun 7, 2020, 12:23 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు పీహెచ్​సీలో వసతులు లేక గర్భిణులు అవస్థలు పడ్డారు. సరైన వైద్యం అందక మృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి. సరైన వసతులు లేక గర్భిణులను పాలమూరు, హైదరాబాద్​కు వెళ్లమని రిఫర్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పీహెచ్​సీలో ఈనెల 6న ఒక్కరోజే 15 గంటల్లో 8 కాన్పులు చేసి గట్టు పీహెచ్​సీ వైద్యులు, సిబ్బంది రికార్డు నెలకొల్పారు.

ఈనెల 5న రాత్రి 8 మంది గర్భిణులు కాన్పు కోసం రాగా.. వైద్యాధికారి రాజసింహ ఆధ్వర్యంలో అప్పటికప్పుడే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరకు మొత్తం 8 మంది ప్రసవాలు పూర్తి చేశారు. 15 గంటల్లో 8 కాన్పులు చేసి రికార్డు నెలకొల్పారు. ఇందులో నలుగురు మగ, నలుగురు ఆడ శిశువులు జన్మించారని వైద్యాధికారి రాజసింహ తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. గతంలో 6 కాన్పులు చేశామని చెప్పారు.

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు పీహెచ్​సీలో వసతులు లేక గర్భిణులు అవస్థలు పడ్డారు. సరైన వైద్యం అందక మృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి. సరైన వసతులు లేక గర్భిణులను పాలమూరు, హైదరాబాద్​కు వెళ్లమని రిఫర్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పీహెచ్​సీలో ఈనెల 6న ఒక్కరోజే 15 గంటల్లో 8 కాన్పులు చేసి గట్టు పీహెచ్​సీ వైద్యులు, సిబ్బంది రికార్డు నెలకొల్పారు.

ఈనెల 5న రాత్రి 8 మంది గర్భిణులు కాన్పు కోసం రాగా.. వైద్యాధికారి రాజసింహ ఆధ్వర్యంలో అప్పటికప్పుడే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరకు మొత్తం 8 మంది ప్రసవాలు పూర్తి చేశారు. 15 గంటల్లో 8 కాన్పులు చేసి రికార్డు నెలకొల్పారు. ఇందులో నలుగురు మగ, నలుగురు ఆడ శిశువులు జన్మించారని వైద్యాధికారి రాజసింహ తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. గతంలో 6 కాన్పులు చేశామని చెప్పారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.