ETV Bharat / state

కొత్తజోన్లకు కసరత్తు - samshabad

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో మరోసారి వికేంద్రీకరణ జరగనుంది.  శంషాబాద్‌ జోన్‌ను రెండుగా విభజించి,  రెండు కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.

సీపీ సజ్జనార్​
author img

By

Published : Feb 25, 2019, 11:26 AM IST

Updated : Feb 25, 2019, 9:36 PM IST

మరోసారి వికేంద్రీకరణ
ఉమ్మడి సైబరాబాద్‌ కమిషనరేట్​లో మరోసారి విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. సైబరాబాద్​ విభజన అనంతరం శంషాబాద్ జోన్‌ పరిధి విస్తృతమైంది. ప్రస్తుతం ఈ కమిషనరేట్‌ విస్తీర్ణం 3,644 చదరపు కిలోమీటర్లు. దీనిలో శంషాబాద్‌ జోన్‌ పెద్దది. అందువల్ల పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జోన్​ను వికేంద్రీకరించేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ దృష్టి సారించారు. పలు ప్రతిపాదనలను ఆయన ప్రభుత్వానికి పంపారు. వారంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌ కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటు కానుంది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ జోన్లలో నూతనంగా చెరో ఠాణా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది.

అత్తాపూర్​ కేంద్రంగా కొత్త ఠాణా

రాజేంద్రనగర్‌ ఠాణా మరోమారు విభజించనున్నారు. ప్రస్తుతం ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధి 48 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీని జనాభా దాదాపు 4.63 లక్షలు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 120 మంది రౌడీషీటర్లుంటే అందులో 80 శాతం మంది ఈ ఒక్క పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే ఉన్నారు. తాజాగా అత్తాపూర్‌ కేంద్రంగా కొత్త పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. తాజా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే నాలుగు జోన్ల సైబరాబాద్‌ అవతరిస్తుంది.

ఇవీ చదవండి:నేడే అసెంబ్లీ చివరి రోజు

మరోసారి వికేంద్రీకరణ
ఉమ్మడి సైబరాబాద్‌ కమిషనరేట్​లో మరోసారి విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. సైబరాబాద్​ విభజన అనంతరం శంషాబాద్ జోన్‌ పరిధి విస్తృతమైంది. ప్రస్తుతం ఈ కమిషనరేట్‌ విస్తీర్ణం 3,644 చదరపు కిలోమీటర్లు. దీనిలో శంషాబాద్‌ జోన్‌ పెద్దది. అందువల్ల పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జోన్​ను వికేంద్రీకరించేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ దృష్టి సారించారు. పలు ప్రతిపాదనలను ఆయన ప్రభుత్వానికి పంపారు. వారంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌ కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటు కానుంది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ జోన్లలో నూతనంగా చెరో ఠాణా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది.

అత్తాపూర్​ కేంద్రంగా కొత్త ఠాణా

రాజేంద్రనగర్‌ ఠాణా మరోమారు విభజించనున్నారు. ప్రస్తుతం ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధి 48 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీని జనాభా దాదాపు 4.63 లక్షలు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 120 మంది రౌడీషీటర్లుంటే అందులో 80 శాతం మంది ఈ ఒక్క పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే ఉన్నారు. తాజాగా అత్తాపూర్‌ కేంద్రంగా కొత్త పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. తాజా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే నాలుగు జోన్ల సైబరాబాద్‌ అవతరిస్తుంది.

ఇవీ చదవండి:నేడే అసెంబ్లీ చివరి రోజు

sample description
Last Updated : Feb 25, 2019, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.