హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన ఖుష్ లోహియా(24) తల్లితో కలిసి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సందర్శనకు వెళ్లింది. ప్రైవేటు సెక్యూరిటీకి చెందిన మహిళా సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. సిగరెట్ పెట్టె లభించగా.. లోనికి అనుమతించేదు. దీంతో వాగ్వాదానికి దిగిన యువతి.. సిబ్బంది సునీత, సుజాతపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో స్వల్ప గాయాలు కాగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బేగంబజార్ పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్య.. ఆ సెల్ఫీలో ఏముందంటే?