ETV Bharat / state

Children approach Police For shelter: అయినవాళ్లు గెంటేశారు... పోలీసులను ఆశ్రయించారు - children complaint on their family members in kancharapalem

ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోవడంతో తమను ఆదరించే వారు ఎవరూ లేరంటూ ముగ్గురు చిన్నారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనతో విస్తుపోయిన పోలీసులు... చైల్డ్ లైన్ సహకారంతో హోమ్​కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Childrens request for help
Childrens request for help
author img

By

Published : Sep 30, 2021, 7:52 PM IST

కుటుంబీకులు పట్టించుకోవడం లేదని ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెం పోలీసులను ముగ్గురు చిన్నారులు ఆశ్రయించారు. కొన్నేళ్లక్రితం తల్లి చనిపోవడంతో, తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారు అమ్మమ్మ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో చిన్నారులను పోషించడం భారంగా ఉందని... వారి అమ్మమ్మ బయటకు పంపించేసింది. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు కంచరపాలెం పోలీస్ స్టేషన్​కు వచ్చారు.

వీరి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... చైల్డ్ లైన్ సహకారంతో హోమ్​కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే చదువుకుంటామని చిన్నారులు అభ్యర్థిస్తున్నారు.

కుటుంబీకులు పట్టించుకోవడం లేదని ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెం పోలీసులను ముగ్గురు చిన్నారులు ఆశ్రయించారు. కొన్నేళ్లక్రితం తల్లి చనిపోవడంతో, తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారు అమ్మమ్మ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో చిన్నారులను పోషించడం భారంగా ఉందని... వారి అమ్మమ్మ బయటకు పంపించేసింది. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు కంచరపాలెం పోలీస్ స్టేషన్​కు వచ్చారు.

వీరి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... చైల్డ్ లైన్ సహకారంతో హోమ్​కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే చదువుకుంటామని చిన్నారులు అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చూడండి: Viral Video: శునకం రోడ్డు దాటేందుకు బాలుడి సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.