ETV Bharat / state

పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలకు శుభవార్త - తెలంగాణ తాజా వార్తలు

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌల్ట్రీ, డైరీ పరిశ్రమలకు ఇంధన శాఖ యూనిట్​ రేటులో రూ.2 సబ్సిడీ ప్రకటించగా... రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నులో మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలిగే అవకాశముంది.

Telangana news
తెలంగాణ వార్తలు
author img

By

Published : Jun 3, 2021, 8:11 AM IST

కొవిడ్​ కష్టకాలంలో డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్తిపన్నులో మినహాయింపు ఇవ్వాలని పౌల్ట్రీ, డెయిరీ ఉత్పత్తిదారులు ఎప్పట్నుంచో కోరుతున్నారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్నులో మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకొంది. పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలు వినియోగించే విద్యుత్​లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కు రూ.2 చొప్పున సబ్సిడీని ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ ప్రకటించింది.

జీహెచ్ఎంసీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్లా ఈ మినహాయింపు వర్తించనుంది. ఆస్తిపై హక్కు, ఆస్తిపన్ను రికార్డుల్లో కొనసాగేందుకు వీలుగా ఏడాదికి ఒక్కో యూనిట్ వంద రూపాయలు మాత్రమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు ఉత్తర్వులు జారీ చేయగా... విద్యుత్​ యూనిట్​ రేటును తగ్గిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలిగే అవకాశముంది.

కొవిడ్​ కష్టకాలంలో డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్తిపన్నులో మినహాయింపు ఇవ్వాలని పౌల్ట్రీ, డెయిరీ ఉత్పత్తిదారులు ఎప్పట్నుంచో కోరుతున్నారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్నులో మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకొంది. పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలు వినియోగించే విద్యుత్​లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కు రూ.2 చొప్పున సబ్సిడీని ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ ప్రకటించింది.

జీహెచ్ఎంసీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్లా ఈ మినహాయింపు వర్తించనుంది. ఆస్తిపై హక్కు, ఆస్తిపన్ను రికార్డుల్లో కొనసాగేందుకు వీలుగా ఏడాదికి ఒక్కో యూనిట్ వంద రూపాయలు మాత్రమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు ఉత్తర్వులు జారీ చేయగా... విద్యుత్​ యూనిట్​ రేటును తగ్గిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలిగే అవకాశముంది.

ఇదీ చూడండి: Vaccine : వ్యాక్సిన్​తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.