ETV Bharat / state

'చెప్పకుండా టీవీ చర్చల్లో పాల్గొంటే చిక్కుల్లో పడతారు' - చెప్పకుండా టీవీ చర్చల్లో పాల్గొంటే చిక్కుల్లో పడతారు

టీకాంగ్రెస్ అధికార ప్రతినిధులపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆంక్షలు విధించింది. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అధ్యక్షతన శుక్రవారం జరిగిన అధికార ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'చెప్పకుండా టీవీ చర్చల్లో పాల్గొంటే చిక్కుల్లో పడతారు'
author img

By

Published : Sep 21, 2019, 5:06 AM IST

Updated : Sep 21, 2019, 7:57 AM IST

వివిధ టీవీ ఛానళ్లకు నిర్వహించే చర్చ కార్యక్రమాలకు కాంగ్రెస్​ పార్టీ తరఫున అధికార ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ నేతలు కొందరు హాజరవుతుంటారు. ఇకపై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనే వారిపై రాష్ట్ర నాయకత్వం ఆంక్షలు విధించింది. వివిధ ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా హాజరయ్యే కార్యక్రమాలలో కాంగ్రెస్ భావజాలం, ప్రతిపక్ష పార్టీగా తెరాస వైఫల్యాలను ఎండగట్టేలా కాంగ్రెస్​ నాయకులు మాటలు సంధించలేకపోతున్నారని హస్తం వర్గాలు పేర్కొంటున్నాయి. రోజువారీ పార్టీ కార్యకలాపాలు, రాజకీయ పరిణామాలపై కనీస అవగాహన లేకుండా పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశాలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి మల్లు రవిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి తిరిగి అధికారికంగా ప్రకటన చేసే వరకు ఏ ఒక్కరు టీవీ చర్చలకు హాజరు కావొద్దని కాంగ్రెస్​ నాయకత్వం స్పష్టం చేసింది. ఎవరైనా పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే పార్టీపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక మరోకారణం కూడా ఉందని... టీవీ చర్చల్లో పాల్గొంటున్న కాంగ్రెస్​ నాయకులు.. అధిక శాతం పార్టీలోని ఒక వర్గానికే అనుకూలంగా మాట్లాడుతున్నారని భావించి ఆంక్షలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

'చెప్పకుండా టీవీ చర్చల్లో పాల్గొంటే చిక్కుల్లో పడతారు'

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో 'హుజూర్​నగర్' చిచ్చు.. నేతల మధ్య మాటల యుద్ధం

వివిధ టీవీ ఛానళ్లకు నిర్వహించే చర్చ కార్యక్రమాలకు కాంగ్రెస్​ పార్టీ తరఫున అధికార ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ నేతలు కొందరు హాజరవుతుంటారు. ఇకపై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనే వారిపై రాష్ట్ర నాయకత్వం ఆంక్షలు విధించింది. వివిధ ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా హాజరయ్యే కార్యక్రమాలలో కాంగ్రెస్ భావజాలం, ప్రతిపక్ష పార్టీగా తెరాస వైఫల్యాలను ఎండగట్టేలా కాంగ్రెస్​ నాయకులు మాటలు సంధించలేకపోతున్నారని హస్తం వర్గాలు పేర్కొంటున్నాయి. రోజువారీ పార్టీ కార్యకలాపాలు, రాజకీయ పరిణామాలపై కనీస అవగాహన లేకుండా పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశాలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి మల్లు రవిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి తిరిగి అధికారికంగా ప్రకటన చేసే వరకు ఏ ఒక్కరు టీవీ చర్చలకు హాజరు కావొద్దని కాంగ్రెస్​ నాయకత్వం స్పష్టం చేసింది. ఎవరైనా పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే పార్టీపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక మరోకారణం కూడా ఉందని... టీవీ చర్చల్లో పాల్గొంటున్న కాంగ్రెస్​ నాయకులు.. అధిక శాతం పార్టీలోని ఒక వర్గానికే అనుకూలంగా మాట్లాడుతున్నారని భావించి ఆంక్షలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

'చెప్పకుండా టీవీ చర్చల్లో పాల్గొంటే చిక్కుల్లో పడతారు'

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో 'హుజూర్​నగర్' చిచ్చు.. నేతల మధ్య మాటల యుద్ధం

Intro:Body:Conclusion:
Last Updated : Sep 21, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.