ETV Bharat / state

కరోనా కేసుల సంఖ్యను సక్రమంగా చెప్పడం లేదు: ఎంపీ రేవంత్​రెడ్డి - ప్రభుత్వంపై రేవంత్​ ఫైర్

రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి హెల్త్​ బులిటెన్​కు వాస్తవాలకు దాదాపు 3వేల కేసుల తేడా ఉందని ఉందని ఆరోపించారు మాల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టమైన లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Mp revanth reddy on corona health bulletin
కరోనా కేసుల సంఖ్యను సక్రమంగా చెప్పడం లేదు: రేవంత్​రెడ్డి
author img

By

Published : Jul 4, 2020, 5:21 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను ప్రభుత్వం సక్రమంగా చూపడం లేదని ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గురువారం మొత్తం కేసులు 18,570 అని హెల్త్ బులిటెన్​లో చూపించారని... అదే లైవ్‌ డ్యాష్​ బోర్డులో మాత్రం 21,393 అని చూపిస్తోందని ఆరోపించారు. హెల్త్ బులిటెన్​కి వాస్తవాలకు దాదాపు 3,000 కేసుల తేడా ఉందని పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ వాస్తవ లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను ప్రభుత్వం సక్రమంగా చూపడం లేదని ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గురువారం మొత్తం కేసులు 18,570 అని హెల్త్ బులిటెన్​లో చూపించారని... అదే లైవ్‌ డ్యాష్​ బోర్డులో మాత్రం 21,393 అని చూపిస్తోందని ఆరోపించారు. హెల్త్ బులిటెన్​కి వాస్తవాలకు దాదాపు 3,000 కేసుల తేడా ఉందని పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ వాస్తవ లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.