ETV Bharat / state

ఆగమైనోళ్లను అయినవాళ్ల దగ్గరికి చేర్చి ఆనందం నింపారు... - CRIME NEWS IN TELANGANA

ఎటు వెళ్తున్నారో తెలియదు... కానీ నడక ఆపరు. ఏం చేస్తున్నారో తెలియదు... అయినా తీరిక లేకుండా ఆలోచిస్తుంటారు. అలా వెళ్తూ... వేరే రాష్ట్రానికి చేరుకున్నారు. అయినవాళ్లు కానరాక కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. మతిస్థిమితం లేక దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న వారిద్దరినీ అధికారులు చేరదీసి స్వస్థలాలకు పంపించి కుటుంబసభ్యుల్లో ఆనందం నింపారు.

MISSING PERSONS CAME BACK TO HOME SAFELY
MISSING PERSONS CAME BACK TO HOME SAFELY
author img

By

Published : Nov 28, 2019, 5:31 AM IST

Updated : Nov 28, 2019, 8:25 AM IST

మతిస్థిమితం కోల్పోయి కేరళ చేరుకున్న ఇద్దరు వ్యక్తులను న్యాయ సేవాధికార సంస్థ స్వస్థలాలకు చేర్చింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన శకుంతల, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన దశరథ్... కొంత కాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఏడాది క్రితం శకుంతల ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో గాలించినప్పటికీ...... ఆచూకీ లభించలేదు. దశరథ్‌ కూడా అలానే తప్పిపోయాడు. మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లిన దశరథ్​... తిరిగి ఇంటికి రాలేదు. కేరళలోని తిరువనంతపురంలో దీనావస్థలో ఉన్న శకుంతల, దశరథ్‌లను.... కేరళ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించి మానసిక చికిత్స చేయించారు. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి... న్యాయసేవాధికార సంస్థకు సమాచారమిచ్చారు.

ఆనందంలో కుటుంబాలు...

న్యాయసేవాధికార సంస్థ అధికారులు పోలీసుల సాయంతో బాధితుల కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబసభ్యులు, పోలీసులతో కలిసి కేరళ వెళ్లిన సంస్థ సభ్యులు... దశరథ్‌, శకుంతలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తమ నుంచి దూరమై.. ఎక్కడున్నారో తెలియక, ఎప్పుడొస్తారో తెలియక క్షోభకు గురైన కుటుంబీకులు... వారి రాకతో ఆనందంలో మునిగితేలారు. రేపు శకుంతల మనవడి వివాహం జరగనుండటం వల్ల... ఆ ఇంట నూతన శోభ సంతరించుకుంది.

అండగా న్యాయ సేవాధికార సంస్థ...

శకుంతల, దశరథ్​ను కుటంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు కష్టపడ్డ అధికారులను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రమణ్యం అభినందించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. మానసిక స్థితి సరిగా లేని అభాగ్యుల పట్ల ఔదార్యం చూపిస్తున్న రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ పనితీరును పలువురు అభినందిస్తున్నారు.

ఆగమైనోళ్లను అయినవాళ్ల దగ్గరికి చేర్చి ఆనందం నింపారు...

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

మతిస్థిమితం కోల్పోయి కేరళ చేరుకున్న ఇద్దరు వ్యక్తులను న్యాయ సేవాధికార సంస్థ స్వస్థలాలకు చేర్చింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన శకుంతల, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన దశరథ్... కొంత కాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఏడాది క్రితం శకుంతల ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో గాలించినప్పటికీ...... ఆచూకీ లభించలేదు. దశరథ్‌ కూడా అలానే తప్పిపోయాడు. మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లిన దశరథ్​... తిరిగి ఇంటికి రాలేదు. కేరళలోని తిరువనంతపురంలో దీనావస్థలో ఉన్న శకుంతల, దశరథ్‌లను.... కేరళ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించి మానసిక చికిత్స చేయించారు. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి... న్యాయసేవాధికార సంస్థకు సమాచారమిచ్చారు.

ఆనందంలో కుటుంబాలు...

న్యాయసేవాధికార సంస్థ అధికారులు పోలీసుల సాయంతో బాధితుల కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబసభ్యులు, పోలీసులతో కలిసి కేరళ వెళ్లిన సంస్థ సభ్యులు... దశరథ్‌, శకుంతలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తమ నుంచి దూరమై.. ఎక్కడున్నారో తెలియక, ఎప్పుడొస్తారో తెలియక క్షోభకు గురైన కుటుంబీకులు... వారి రాకతో ఆనందంలో మునిగితేలారు. రేపు శకుంతల మనవడి వివాహం జరగనుండటం వల్ల... ఆ ఇంట నూతన శోభ సంతరించుకుంది.

అండగా న్యాయ సేవాధికార సంస్థ...

శకుంతల, దశరథ్​ను కుటంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు కష్టపడ్డ అధికారులను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రమణ్యం అభినందించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. మానసిక స్థితి సరిగా లేని అభాగ్యుల పట్ల ఔదార్యం చూపిస్తున్న రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ పనితీరును పలువురు అభినందిస్తున్నారు.

ఆగమైనోళ్లను అయినవాళ్ల దగ్గరికి చేర్చి ఆనందం నింపారు...

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

TG_HYD_65_27_MISSING_PERSONS_CAME_BACK_PKG_3064645 REPORTER: NAGESHWARA CHARY ( ) మానసిక స్థితి సరిగా లేక... ఇళ్లు విడిచి వెళ్లారు. ఊరు, జిల్లా, రాష్ట్రమూ దాటి పోయారు. ఎలా వెళ్లారో తెలియదు కాదు కానీ.. కేరళ చేరుకున్నారు. తిరువనంతపురంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిద్దరినీ అక్కడి అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఎక్కడికి వెళ్లారో అంతు చిక్కక... వారి కుటుంబ సభ్యులు వెదికి, వెతికి ఊరుకున్నారు. చివరకు న్యాయ సేవాధికార సంస్థ జోక్యంతో... ఆ ఇద్దరు బాధితులు స్వస్థాలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. LOOK వాయిస్ ఓవర్: న్యాయ సేవాధికార సంస్థ చొరవతో... ఇళ్ల నుంచి తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు తిరిగి కుటుంబ సభ్యులను చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన శకుంతల... నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన దశరథ్...కొంత కాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఏడాది క్రితం శకుంతల ఇంట్లోంచి బయటకు వెళ్లి పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో తిరిగినప్పటికీ...ఫలితం కనిపించలేదు. దశరథ్ దీ అది పరిస్థితి. మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లిన దశరథ్... తిరిగి ఇంటికి రాలేదు. ఎలా వెళ్లారో కానీ... ఇద్దరూ వేర్వేరుగా కేరళలో ప్రత్యక్షమయ్యారు. తిరువనంతపురంలో దీనావస్థలో ఉన్న శకుంతల, దశరథ్ లను అక్కడి అధికారులు ఓ సంరక్షణ కేంద్రానికి తరలించి.. మానసిక చికిత్స చేయించారు. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని కేరళ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ గుర్తించింది. బైట్: జీవీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, సభ్య కార్యదర్శి వాయిస్ ఓవర్: శకుంతల, దశరథ్ లను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నించాలని అక్కడి న్యాయసేవ అధికారులు.. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు ఆగస్టులో సమాచారం ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారో అర్థం కాకపోవడంతో.. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అధికారులు.. పోలీసుల సహకారం తీసుకున్నారు. కేవలం ఫోటో, జిల్లా పేరు మాత్రమే తెలిసినప్పిటీ.. పోలీసుల ద్వారా చివరకు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు, పోలీసులతో కలిసి కేరళ వెళ్లిన న్యాయసేవాధికార సంస్థ అధికారులు... ఇద్దరినీ హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక తిరిగి రారేమోననుకున్న వ్యక్తులు మళ్లీ రావడంతో.. కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగింది. శకుంతల మనవడి వివాహం రేపు జరగనుండటంతో... ఆ ఇంట సంతోషం నెలకొంది. బైట్: జీవీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, సభ్య కార్యదర్శి బైట్ వీరప్ప, శకుంతల అల్లుడు బైట్ చంద్రయ్య, దశరథ్ సోదరుడు వాయిస్ ఓవర్: శకుంతల, దశరథ్ ను కుటంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు కష్టపడ్డ అధికారులను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రమణ్యం అభినందించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. END
Last Updated : Nov 28, 2019, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.